Writer Jayakumar Kanagala : అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టిన శ్రీదేవి గారు యుక్తవయసులో హీరోయిన్ గా మొదలు పెట్టి మొదటి భారతీయ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. మొత్తం దక్షిణాది భాషలలో నటించిన ఆమె అలాగే హిందీలో కూడా టాప్ హీరోయిన్ గా వెలుగొందారు. ఆమె తెలుగులో సూపర్ స్టార్స్ అందరితోనూ హిట్ పెయిర్ గా నిలిచింది. తాజాగా రైటర్ అలాగే డైరెక్టర్ అయినా జయకుమార్ కనగాల గారు శ్రీదేవి గారి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆమె ఎలా ఉండేవారంటే…
అక్కినేని నాగేశ్వరావు గారు, శ్రీదేవి గారి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. కోదండ రామిరెడ్డి గారు నాగేశ్వరావు గారి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీరంగనీతులు’ సినిమాలో శ్రీదేవి గారు హీరోయిన్ గా చేసారు. ఆ సినిమాకు కో డైరెక్టర్ గా పనిచేసిన జయకుమార్ గారు ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అయన శ్రీదేవి ఆహారపు అలవాట్లను చూసి షాక్ అయ్యానంటూ చెప్పారు. అందరూ భోజనంకి వెళ్లగా ఆమె మాత్రం సెట్ లోనే ఉన్నారు. నేను వెళ్లి భోజనానికి వెళ్లలేదా మేడం అంటే బిస్కెట్స్ చూపించి ఇదే నా భోజనం అంటూ చెప్పారు.

నేను ఆ భోజనము తీసుకుంటే లావెక్కుతాను అందుకే ఇదే నా ఫుడ్ అంటూ చెప్పారట. హీరోయిన్స్ హీరోలను చూసి చాలా లగ్జరీగా ఉంటారు అనుకుంటాం కానీ వాళ్లు మనలాగా కడుపు నిండా తినడానికి కూడా ఉండదని అనిపించింది. ఇక రేపు షూటింగ్ లో ఏ బట్టలు వేసుకోవాలి హెయిర్ స్టైల్ ఏముండాలి లాంటివి ముందు రోజే చెప్పి పంపిస్తాం. అయితే ఆరోజు చెప్పాం కానీ ఆ సీన్ షూటింగ్ కాకుండా వేరే సీన్ మార్చడజం వల్ల శ్రీదేవి గారి రూమ్ కి రాత్రి 11 గంటలకు వెళ్లాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు నన్ను పంపారు. వెళ్ళగానే శ్రీదేవి గారి చెల్లి డోర్ ఓపెన్ చేసారు. శ్రీదేవి గారు ఆ సమయంలో వెళ్లి చెప్పినా ఏమాత్రం విసుక్కలేదు చాలా సింపుల్ గా ఉన్నారు అంటూ జయకుమార్ గారు శ్రీదేవి గారి గురించి తెలిపారు.

































