వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతల కంటే రఘురామ కృష్ణంరాజే జగన్ సర్కార్ పై ఎక్కువగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రఘురామ జగన్ చెప్పినా తాను బురదలోకి దిగలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారాడని అన్నారు.
2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జగన్ తో మూడు నెలల పాటు ట్రావెల్ చేశానని రఘురామ అన్నారు. ఆ సమయంలో నర్సాపురంలో వరదలు వచ్చాయని.. ఈ విషయం తెలిసి జగన్ అక్కడికి పర్యటించడానికి వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో పంట పొలంలో జగన్ బురదలో దిగాడని తనను కూడా దిగమని జగన్ చెప్పినా తాను దిగలేదని అన్నారు. జగన్ బురదలో దిగి పంటను చేతులతో పట్టుకుని చూసి రైతులతో మాట్లాడాడని చెప్పారు.
జగన్ రైతులతో చాలా సమయం మాట్లాడి వారికి ధైర్యం చెప్పాడని అన్నారు. అయితే ఆ తరువాత జగన్ చేసీంది కరెక్ట్ అని తనకు అనిపించిందని.. అయితే జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారారని చెప్పారు. జగన్ ప్రస్తుతం ప్రజల మధ్యకే రావడం లేదని… పాదయాత్ర సమయంలో పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ముద్దాడిన జగన్ ఇప్పుడు మారిపోయారని చెప్పారు.
జగన్ ఇప్పటికైనా గతాన్ని స్మరించుకుంటే బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షంలో ఉన్న సమయంలో చేస్తున్న పనులకు తేడా గమనించాలని సూచించారు. రఘురామ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…