వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతల కంటే రఘురామ కృష్ణంరాజే జగన్ సర్కార్ పై ఎక్కువగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రఘురామ జగన్ చెప్పినా తాను బురదలోకి దిగలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారాడని అన్నారు.
2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జగన్ తో మూడు నెలల పాటు ట్రావెల్ చేశానని రఘురామ అన్నారు. ఆ సమయంలో నర్సాపురంలో వరదలు వచ్చాయని.. ఈ విషయం తెలిసి జగన్ అక్కడికి పర్యటించడానికి వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో పంట పొలంలో జగన్ బురదలో దిగాడని తనను కూడా దిగమని జగన్ చెప్పినా తాను దిగలేదని అన్నారు. జగన్ బురదలో దిగి పంటను చేతులతో పట్టుకుని చూసి రైతులతో మాట్లాడాడని చెప్పారు.
జగన్ రైతులతో చాలా సమయం మాట్లాడి వారికి ధైర్యం చెప్పాడని అన్నారు. అయితే ఆ తరువాత జగన్ చేసీంది కరెక్ట్ అని తనకు అనిపించిందని.. అయితే జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారారని చెప్పారు. జగన్ ప్రస్తుతం ప్రజల మధ్యకే రావడం లేదని… పాదయాత్ర సమయంలో పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ముద్దాడిన జగన్ ఇప్పుడు మారిపోయారని చెప్పారు.
జగన్ ఇప్పటికైనా గతాన్ని స్మరించుకుంటే బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షంలో ఉన్న సమయంలో చేస్తున్న పనులకు తేడా గమనించాలని సూచించారు. రఘురామ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…