YS Jagan: వైయస్ జగన్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదానీ వ్యవహారంలో ఈయనకు ముడుపులు అందాయని జగన్ పై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందిస్తూ ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కదా ఐదు సంవత్సరాల కాలంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు . కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. రెడ్బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. మన ప్రభుత్వ హయామంలో రైతులకు ఉచితంగా పగటిపూట తొమ్మిది గంటల పాటు కరెంట్ ఫ్రీగా ఇచ్చాము కానీ ప్రస్తుతం రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదని తెలిపారు.
కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోంది. మా హయాంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మంచి చేశాము ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.సూపర్ సిక్స్లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కనిపించవు. రెడ్బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు బడ్జెట్ తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో స్కాములు జరుగుతున్నాయని తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎంతో శ్రమించానని.. కానీ తన కష్టాన్ని వృథా చేస్తున్నారని వైయస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ లో సంచలనంగా మారాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…