Featured

తెలంగాణలో కొత్త పార్టీకి ముహూర్తం పెట్టిన వైఎస్‌ షర్మిల..! తండ్రి పుట్టిన రోజునే..

తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ పెట్ట బోతున్న విషయం తెలిసిందే.. దీని సంబంధిచిన పనులో నిమగ్నమయ్యారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల. తన కొత్త పార్టీ కోసం పలు జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలతో ఆమె బుధవారం లోటస్‌పాండ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనకు పునరుజ్జీవం పోసేందుకు నేను సిద్దంగా ఉన్నానని వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజల ఆశయాలే మా పార్టీ సిద్ధాంతాలు.. ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన అనగా జూలై 8న తన పార్టీని ఆవిష్కరించానున్నట్టు వైఎస్‌ షర్మిల తెలిపారు. అదేరోజున పార్టీ పెరుతో పాటూ జెండా, ఎజెండా ను ప్రకటించనున్నారు.

‘తెలంగాణలో ప్రజల బాగు కోసం నూతనంగా స్థాపించబోయే మన పార్టీకి సంబంధించి జెండా, ఎజెండా రూపకల్పన చేయబోతున్నాం. దీని కోసం ప్రజలంతా reach@realyssharmila.com అనే ఈమెయిల్‌ ఐడీకి గానీ, 8374167039 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా గానీ తమ సూచనలు పంపాలని కోరుతున్నాం’ అని ఆమె చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలందరూ ఆమోదించేలా ఉండాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులు వీరే.. తొలిసారి పేర్లు వెల్లడించిన భారత ఆర్మీ..!

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…

1 hour ago

బిగ్‌బాస్-10లో పోలీస్ ఎంట్రీ..? ఎస్‌ఐ వీడియోపై నెటిజన్లలో హాట్ డిబేట్..!

తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…

2 hours ago

ఖాళీ కడుపుతో వర్కవుట్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే ఆరోగ్యానికే ముప్పు..!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…

2 hours ago

ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బాహుబలి 3’ రానుందంటూ ప్రకటన..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…

7 hours ago

‘పెద్ది’ ప్రభావమా..? చరణ్-సుకుమార్ సినిమాకు బడ్జెట్ కత్తెర..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…

7 hours ago

తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…

10 hours ago