గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఈ నెల 26 నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఈనెల 26, 28 తేదీల్లో మరియూ జులై 1, 4 తేదీల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు.

అంబేద్కర్ నగర్ పీవీ మార్గ్లో- 330, జీవైఆర్ కాంపౌండ్లో – 180, పొట్టి శ్రీరాములు నగర్లో – 162, గొల్లకుర్మయ్య కాలనీలో – 10 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను జీహెచ్ఎంసీ దశలవారీగా లబ్దిదారులకు అందించనుంది.



























