ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్విరాజ్ సరస సంభాషణకు చెందిన ఆడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు. ఇద్దరం కలిపి డ్రింక్ చేద్దాం అని, కంపెనీ ఇవ్వమని అడిగారు. అన్నం తినేటప్పుడు నేను గుర్తురాలేదా ? నవ్వుంటె నాకిష్టం అంటూ మంచి రొమాంటిక్ గా మాట్లాడిన ఆడియో బయటకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. ఎంతో ఉన్నతమైన పోసిషన్ లో ఉండి, ఉద్యోగులతో ఇలా మాట్లాడడం పై చాలా విమర్శలు వస్తున్నాయి. పృద్వి వ్యవహార శైలిపై ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. తక్షణమే పృద్వి ని ఎస్వీబీసీ ఛైర్మెన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పదవి ఉంది కదా అని ఎగిరి ఎగిరి పడ్డ పృద్వి కి తగిన శాస్తి జరిగిందని మరికొందరు అంటున్నారు.



























