Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు ‘జగమే మాయ’ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.

మా అసోసియేషన్ కు బిల్డింగ్ సీఎం పదవిలోకి వచ్చిన ఏ నాయకుడు ఆలోచించలేదంటూ చెప్పారు. హైదరాబాద్ కు సినిమా ఇండస్ట్రీ తరలి రావడానికి దాదాపు 10 ఏళ్ళ పైనే పట్టిందంటూ తెలిపారు. ఇక భూమి ఇస్తే మా బిల్డింగ్ కడదామని అనుకుంటే ఏ సీఎం ఇవ్వలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ కి రామానాయుడు స్టూడియోస్ కి మధ్యలో కొంత భూమి ఏదైనా సినిమా ఇండస్ట్రీ అవసరాల కోసం వాడుకొమ్మని ప్రభుత్వం తెలిపినా శాంక్షన్ చేయలేదు. అటు ఇస్తామని చెప్పకుండా ఇవ్వనని చెప్పకుండా చాలా ఏళ్ళు చేయడం వల్ల మా బిల్డింగ్ నిర్మాణం జాప్యమైంది.

ఇక ఎన్టీఆర్ సీఎం అయినా, చంద్రబాబు సీఎం అయినా మా బిల్డింగ్ కి భూమి శాంక్షన్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి సినిమా పెద్దలందరూ వెళ్ళినపుడు నేను రానని చెప్పినా తీసుకెళ్లారు. ఆయనకు నన్ను చూస్తే నచ్చదు టీడీపీ వాడినని అందుకే వద్దని చెప్పినా వినకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లేకుండా ఎలా వెళ్తాము అని పిలుచుకుపోయారు. నాగేశ్వరావు గారు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మొదలగు అందరూ అగ్ర హీరోలు వెళ్లగా రాజశేఖర్ రెడ్డి గారు మురళీ మోహన్ ఉన్నాడుగా ఇంకా ప్రభుత్వం భూమి ఇవ్వడం ఎందుకు తనని అడగండి అంటూ నవ్వాడు. ఇక ఇవ్వడని అక్కడున్న వాళ్లందరికీ అర్థమై దాదాపు ముప్పై మంది సినిమా వాళ్ళం వెళ్లగా అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందామని అడిగితే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నాకు టైం లేదని వెళ్ళిపోయాడు. అపుడు అందరం చాలా అవమానంగా ఫీల్ అయ్యాము అంటూ చెప్పారు.

































