కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ పే స్కేల్ వర్తింపజేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు.. మోడల్ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం పేస్కేల్ వర్తింపజేయాలని నిర్ణయించింది.

వీరిలో కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్ వర్తించదని, అలానే కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.5లక్షల, సహజంగా మరణిస్తే రూ.2లక్షల సాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.



























