బాహుబలి, సాహో సినిమాలతో ఇండియన్ స్టార్ గా ఎదిగిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవలే తిరిగి క్రొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ చిత్రానికి దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కధానాయిక కాగా, యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాహో సినిమా సెట్స్ మీద ఉండగానే మొదలైన ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. అయితే సాహో సినిమా తరువాత విదేశాలకు బ్రేక్ కోసం ప్రభాస్ వెళ్లిపోవడంతో షూటింగ్ ఆలస్యమైంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ప్రభాస్ తో పాటు మరికొందరితో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రారంభ సమయం నుంచి ఇది ఒక పీరియాడిక్ డ్రామా అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమా రొమాంటిక్ డ్రామా మాత్రమే అని ట్విస్ట్ ఇచ్చి, ఇది పీరియాడిక్ డ్రామా కాదు అని స్పష్టం చేసాడు. ఈ సినిమాను 2021 సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



























