నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు బీసీల కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. స్వయం ఉపాధికి ఊతమిచ్చేందుకు, యువతను ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగేందుకు అవకాశమిస్తోంది. సబ్సిడీ రుణాల కోసం వేచిచూస్తున్న వారికి సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఏప్రిల్ 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారి సూచించారు. 21 -55 ఏండ్ల మధ్య వయస్కులు, రూ. రెండు లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.



























