కర్ణాటక హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రిలో ఒక కాలితోనే శిశువు జన్మించిన ఘటన వెలుగుచూసింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఒక మహిళను బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ చేసి అనంతరం పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయారు. నడుము కింద ఒక కాలు తప్ప సాధారణ శరీర భాగాలేమీ లేకుండానే జన్మించిన అరుదైన శిశువు ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అరుదైన శిశువుకు నడుము క్రింద ఒక కాలు ఆకారం తప్పితే సాధారణంగా ఉండే శారీరక భాగాలు లేవు. ఇది వైద్యులను ఆశ్చర్యం కలిగించింది. కాగా.. కిమ్స్ హాస్పిటల్ లోని పిల్లల విభాగంలో నిపుణులైన డాక్టర్లు పుట్టిన వింత శిశువు గురించి సరైనా కారణాలు వెతికేందుకు ప్రయత్నిచారు. కానీ ఆ అరుదైన బిడ్డ పుట్టిన 20 నిమిషాల్లోనే చనిపోయింది.































