అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు తాపత్రయ పడుతున్నారు కొందరు. అటువంటి ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువతులు మరియు ఆంటీలు ఆన్ లైన్ వ్యభిచారం చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇదే అదునుగా అమాయకుల నుంచి అందినతా దోచేస్తున్నారు. తాజగా రాజస్థాన్ రాష్ట్రంలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్ లోని వివిధ పట్టణాల్లో ఈ తరహా కేసులు ఎకువవడంతో వీటిపై ప్రత్యెక నిఘా పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ క్రమలో షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు పోలీసులు. ఆన్లైన్ వ్యభిచారం పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం.. ఆపై వీడియో కాల్స్ అంటూ గంటకి రూ.500 అదే న్యూడ్ వీడియో చాట్ అయితే గంటకి రూ.300 రూపాయలు ఇక న్యూడ్ ఫోటోలకి రూ.150 ఇలా రేట్లను ఫిక్స్ చేసి ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఇక వీరిమాయలో పడిన కొందరు యువకులు వీడియో కాల్స్ చేయడం, తమ ఫోటోలను షేర్ చేయడం చేసారు. ఇక దొరికిందే అదునుగా యువకుల ఫోటోలు, వీడియోలతో యువకులను బెదిరించడం మొదలు పెడుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, విడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తాం అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందనే భయంతో వారు అడిగినంత డబ్బు సమర్పించుకుంటున్నారు.. లక్షల రూపాయిలు ఇచ్చినా కూడా వదలడం లేదు ఆ యువతులు. డబ్బు అవసరం అయినప్పుడల్లా వీరిని బెదిరించడం వంటివి చేస్తున్నారు.
దీనితో కొందరు యువకులు పోలీసులకు పిర్యాదు చేసారు. ఆ పిర్యాడుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న 70 మందికి పైగా యువతులు మరియు ఆంటీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువతులు వీడియో కాల్, న్యూడ్ ఫోటోలు వంటివి పంపుతున్నారని ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.






























