సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపించే పేర్లలో కత్తి మహేష్ పేరు ఒకటి. ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడిగా రాజకీయ విమర్శకుడిగా నిత్యం ఏదో ఒక వార్తల ద్వారా సోషల్ మీడియాలో ఉండే కత్తి మహేష్ మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. కత్తి మహేష్ జూన్ 26న నెల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు.

అయితే ఆ సమయంలో కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 17లక్షలు విడుదల చేయడం కూడా జరిగింది. అయితే కత్తి మహేష్ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అయన కోలుకున్తున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. కానీ అనుకోకుండా అయన జులై 10వ తేదీన ఉదయం మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చిందని అందువల్ల అయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశారు.

ఈ నేపధ్యంలో జులై 12వ తేదీన చిత్తూరు జిల్లాలోని కత్తి మహేష్ స్వగ్రామంలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం మహేష్ అంత్యక్రియలకు హాజరైన మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ మహేష్ వెనుక పలు అనుమానాలు ఉన్నాయని… దీనిపై వైద్యులు వివరణ ఇవ్వాలని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం సిట్టింగ్ జడ్జెస్ తో కత్తి మహేష్ మరణంపై విచారణ జరిపించాలని కోరారు.

ఈ ప్రమాదంలో కారు కుడివైపు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ కి ఎటువంటి గాయాలు కాలేదని. కానీ ఎడమవైపు కూర్చున్న మహేష్ కు మాత్రం తీవ్ర గాయాలు కావడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కత్తి మహేష్ కి చాలా మంది శత్రువులు ఉన్నారని అందువల్ల ఈ కేసుపై విచారణ జరిపించాలని కోరారు. అడలావుంటే కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ కూడా తన కొడుకు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజగా ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ మృతిపై విచారణ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపద్యంలో కత్తి మహేష్ కారు డ్రైవర్ సురేష్ ని విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది.


































