దేశ వ్యాప్తంగా ఎన్నో సినిమా పరిశ్రమలున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా పలు రకాల ఇండస్ట్రీలున్నాయి. ఏ భాషలోనైనా సినిమా హిట్ అయితే.. దాన్ని మరో సినిమాలో డబ్బింగ్ చేయడమో.. లేదంటే రీమేక్ చేయడమో చేస్తుంటారు. నిత్యం పలు భాషల చిత్రాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఆనవాయితీ ఎన్నో ఏండ్లుగా కొనసాగుతుంది. హిందీ, తమిళ, మలయాళం, కన్నడ సహా పలు భాషల చిత్రాలను తెలుగు జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. వాటిలో నటించి హీరో, హీరోయిన్లు ఇక్కడి వారినీ బాగా ఆకట్టుకున్నారు కూడా. అయితే తెలుగులో డబ్బింగ్ ఎప్పుడు మొదలైంది? తెలుగులో డబ్ అయిన తొలి సినిమా ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1931లో వెండి తెరపై తొలిసారి తెలుగు మాటలు వినిపించాయి. అంతకు ముందే తెలుగు సినిమా పరిశ్రమ ఏర్పడినా మూకీ మూవీసే వచ్చాయి. మూకీ సినిమా టాకీగా మారింది మాత్రం 1931లోనే. ఇదే సమయంలో డబ్బింగ్ సినిమాలు మొదలయ్యాయి. 1950 నుంచి తెలుగులో డబ్బింగ్ సినిమాలు రావడం మొదలు పెట్టాయి. తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ మూవీ ఆహుతి. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన నీరా ఔర్ నందా సినిమాకు డబ్బింగ్ ఈ సినిమా.

ఈ సినిమాలో జయసింహ, రూప్ బసంత్, శశి, నిశి బరన్ సహా పలువురు తారలు నటించారు. ఆర్.ఎస్. జున్నాకర్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. హిందీలో పి.శంకర్ స్వరాలు సమకూర్చాడు. తెలుగులో సాలూరి రాజేశ్వరరావు ఈ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమాతోనే తెలుగు మహాకవి శ్రీశ్రీ వెండితెరకు ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమాకు మాటలు, పాటలు రాసి సినిమా రంగాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ సినిమాను నవీనా ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులోకి డబ్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించడంతో తెలుగులోకి డబ్బింగ్ సినిమాల రాక మొదలయ్యింది.
































