Connect with us

General News

నిర్భయ కంటే ఘోరం..ఒక అమ్మాయిపై 14 మంది దారుణంగా అత్యాచారం.. స్పృహ కోల్పోయినా వదల్లేదు..భద్రాద్రి జిల్లాలో దారుణం..

Published

on

బాలికను హింసించారు.. వేధించారు..నిర్భయ కంటే ఘోరంగా అత్యాచారం చేశారు..అంతేకాదు స్పృహ కోల్పోయినా వదల్లేదు..పైగా జరిగిన ఘోరానికి పెద్దమనుషులు ఆ గిరిజన బాలిక శీలానికి వెలకట్టారు..గిరిజన బాలికపై అత్యాచార ఘటనలో విస్తుపోయే వాస్తవాలు..భద్రాద్రి పోలీసుల అదుపులో నిందితులు..

బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి 15 మందిపై కేసు నమోదు కాగా.. 14 మందిని అరెస్టు చేశామని భద్రాద్రి జిల్లా మణుగూరు డీఎస్పీ సాయిబాబా తెలిపారు. ఏడూళ్ల బయ్యారం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులు కుంజా ఏసు, పోలెబోయిన భరత్‌, కొట్టెం కిరణ్‌ , వినోద్‌, నవీన్‌ లతో పాటు పోలేబోయిన మహేష్‌, ఎట్టిరాము, పాల్వంచ రాజు, వాడె ప్రవీణ్‌, కుర్సం మురళీ, పాల్వంచ దివాకర్‌, కొట్టెం కన్నారావు, ఎండి గౌస్‌పాషా, మన్నెం సమ్మిరెడ్డిని చూపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సాయిబాబా మాట్లాడారు. పాండురంగాపురం గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక ఆమె తల్లి దండ్రులు బంధువుల ఇంటికి వెళ్లగా.. మధ్యాహ్నం సమయంలో చాక్లెట్లు కొనుక్కనేందుకు దగ్గరలో ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లింది. ఆ బాలికతో మాటలు కలిపిన కుంజా ఏసు, పోలేబోయిన భరత్‌, కిరణ్‌, వినోద్‌ నవీన్‌ కలిసి ఇంటికి తీసుకెళతామని బాలికను నమ్మించి బాలికను ఆటో (టీఎస్‌04, యూబీ 0921)లో ఎక్కించుకున్నారు. జానంపేట రిజర్వు ఫారెస్టు చప్టా ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాలిక స్పృహ కోల్పోగా.. ఏసు, భరత్‌ ఫోన్‌ ద్వారా ఇచ్చిన సమాచారంతో మరో ఎనిమిది మందిని పిలిపించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

స్పృహలేని బాలికను అదే ఆటోలో అమరారం గ్రామంలో బాలిక తాతా అని పిలుచుకునే సమ్మిరెడ్డి వద్ద దింపి ఈ విషయం బయటికి చెప్పొద్దని బెదిరించి వెళ్ళిపోయారు.. కాస్త కోలుకున్న బాలిక విషయాన్ని తాత సమ్మిరెడ్డికి చెప్పింది. సమ్మిరెడ్డి కూడా ఆ బాలికను బలవంతం చేశాడు.

ఉదయం ఆ బాలిక బస్సెక్కి వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో ఉండే తన అన్న ఇంటికి చేరుకుంది. నిరసంగా ఉన్న చెల్లిని గమనించిన సోదరుడు ప్రశ్నించగా.. విషయం చెప్పింది. ఈ లోపు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు మూడు రోజులు అనంతరం ఆమె వాజేడులో ఉందని తెలుసుకున్నారు. అస్వస్థతతో ఉన్న బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో పెద్ద మనుషులు, పార్టీలకు చెందిన నాయకులు కొందరు ఈ విషయాన్ని బయటికి పొక్కనీయవద్దని, పోలీసుస్టేషన్‌కు వెళ్లొద్దని ఇందుకు గానూ రూ.ఐదు లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. వారి మాటలు వినకుండా సదరు బాలిక కుటుంబసభ్యులు తమకు చేసిన ఫిర్యాదు ఆధారంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. తగిన ఆధారాలను సేకరించామని పోలీసులు తెలిపారు..

సంఘటన జరిగిన చప్టా ప్రాంతంలో పెనుగులాడినట్లు, పగిలిన గాజుముక్కలు, చిరిగి చెల్లా చెదురైన చాకెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలికను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించామన్నారు. తమ అన్వేషణలో ఐదుగురు ప్రధాన నిందితులు ఉన్నట్లు తెలిసిందన్నారు..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!