కరోనా ఉద్ధృతి తగ్గటంతో విద్యాసంస్థల పునప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ కానున్నారు. జులై 1 నుంచి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించినందున.. విద్యా సంస్థల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, ఫీజులు తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.

పాఠశాలలను దశల వారీగా ప్రారంభించాలని విద్యా శాఖ భావిస్తోంది. ఆన్లైన్ కాకుండా కేవలం ప్రత్యక్ష బోధన చేపట్టడం సాధ్యమా అనే అంశాన్ని కూడా విద్యా శాఖ పరిశీలిస్తోంది. మరోవైపు ఫీజుల విషయంలో జీవో 46ను కొనసాగించాలని విద్యా శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.































