సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. ప్రజల సౌలభ్యం, సాధారణ జనజీవనం కోసం లాక్ డౌన్ ఎత్తివేసాం. ఒకవేళ మళ్ళీ కరోనా కేసులు పెరిగి పరిస్థితి అడుపుతప్పితే.. మరోసారి లాక్ డౌన్ పెట్టాల్సి వస్తుంది. కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సివస్తుంది. దేనిపై మేము వేనుకాడబోం.

తప్పని సరి పరిస్టితుల్లో లాక్ డౌన్ పెట్టడం వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. ఈ లాక్ డౌన్ ప్రభావం రాష్ట్రంలోని అనేక రంగాలపై తీవ్రంగా చూపింది. అందువల్ల ప్రజలందరూ జాగ్రత్త ఉండాలి. అని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్ అన్నారు.





























