కొందరికి తరచూ వెన్ను నొప్పి బాధిస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ కు వివిధ రకాల కారణాలున్నాయి. బ్యాక్ పెయిన్ కు చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకూ కారణాలే. కూర్చొనే భంగిమ సరిగాలేప్పుడు లేదా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, తీవ్రమైన వ్యాయామాలు చేయడం, యాక్సిడెంట్స్, రోజులో ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేయడం వంటివి బ్యాక్ పెయిన్ కు కారణాలవుతున్నాయి. ఏది ఏమయినా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడుం నొప్పి (బ్యాక్ పెయిన్) వచ్చి తెగ ఇబ్బంది పెడుతోంది. దీనికి చక్కని సహజ సిద్ధమైన ఖర్చు లేని చిట్కాలు మీకోసం..
Advertisement
చిట్కాలు:
*కొద్దిగా అల్లం తీసుకుని పేస్ట్ లా చేసుకుని నడుం నొప్పి ఉన్న చోట రాయాలి. 20 నిమిషాలసేపు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే నడుం నొప్పి తగ్గుముఖం పడుతుంది.
*దీనికి కొన్ని అల్లం ముక్కలు, తేనె కావాలి. ముందుగా ఓ బౌల్ లో వాటర్ వేసుకుని స్టవ్ పై ఉంచి బాయిల్ చేస్తూ ఉండాలి. అందులో అల్లం ముక్కలు వేసి కాసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ అల్లం రసం కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసుకుని తాగితే నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కూడా పరగడపున తాగాలి. రెగ్యులర్ గా చేస్తే నొప్పి తగ్గుముఖం పడుతుంది.
Advertisement
*వెల్లుల్లి పేస్ ను ఓ గ్లాస్ వాటర్ లో కరిగించుకుని తాగాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే నడుం నొప్పి నుంచి రిలీఫ్
*పసుపు, అల్లం రసం, పాలు కావాలి. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం రసం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ పాలను పరగడపున తాగితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది.
*ఆవనూనె, నువ్వుల నూనె రెండూ సమాపాళ్లలో తీసుకుని నడుం నొప్పి ఉన్నచోట మర్దన చేయాలి. తరచుగా ఇలా చేస్తూ ఉంటే నొప్పి మటుమాయం.
Advertisement
*శొంటి గంథాన్ని తీసుకుని నడుం పై భాగాన పట్టీలా రాసుకోవాలి. అలా కాసేపు ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
*నిటారుగా కూర్చుని డ్రైవింగ్ చేయాలి. వెన్నును వంచకుండా కూర్చోవడం వల్ల వెన్ను, నడుం నొప్పులు తగ్గుముఖం పడతాయి. రెండు పాదాలు కింద ఆనేలా కుర్చీలో కూర్చోవాలి.
*వెన్నుపూసకు బలాన్నిచ్చే మినపప్పు రెగ్యులర్ గా తినాలి. వారానికి రెండు సార్లయినా మినప్పప్పుతో చేసిన ఆహారం తినాలి. రోజువారీ డైట్ ఈ పప్పు ఉండేలా చూసుకుంటే వెన్నుపూసకు సరైన పోషకాలంది బలోపేతం అవుతుంది.
Advertisement
*కొబ్బరినూనెలో కర్పూరం బిళ్లలు వేసి బాగా కరిగిన తర్వాత నడుం నొప్పి ఉన్న చోట రాస్తే దెబ్బకు రిలీఫ్ వస్తుంది.
*పల్చటి మజ్జిగలో కొద్దిగా సున్నం తేటను కలిపి పరగడపున తాగాలి.
*కొబ్బరినూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో కొబ్బరినూనె వేసి ఉంచుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయలను అందులో వేసుకోవాలి. బాగా మరిగిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ నడుం నొప్పి ఉన్నచోట రాసుకోవాలి. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నడుం నొప్పిని నివారిస్తాయి.
Advertisement
*తులసి ఆకులు, రాళ్ల ఉప్పు తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అందులో తులసి ఆకులు వేసుకుని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ నీటిని రోజూ పరగడపున తాగితే నడుం నొప్పికి చక్కటి పరిష్కారం. తులసి ఆకుల్లో ఉన్న ఆయుర్వేద గుణాలు నడుం నొప్పిని తిప్పికొడతాయి.
ఇందులో ఏ ఒక్కటి క్రమం తప్పకుండా ఆచరించినా మీ నడుం నొప్పి త్వరలోనే తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు సహజసిద్ధమైన మార్గంలో నడుం నొప్పిని తగ్గించుకుంటే తిరిగి మళ్లీ రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.