అభం శుభం తెలియని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత ధారుణంగా హత్య చేశారు. నెల్లూరు నగరంలో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు లోని రంగనాయకులపేట యాదవ వీధిలో నివశిస్తున్న వెంకటేశ్వర్లు, విద్యావతి దంపతులకు జూన్ 24న ఆడ శిశువు జన్మించింది. అప్పటికే వారిద్దరి రెండేళ్ళ పాప కూడా ఉంది. అయితే 15 రోజుల పసికందు ఉయ్యాలలో నిద్రపోతున్న సమయంలో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి వాటర్ ట్యాంకులో పడవేసారు గుర్తుతెలియని వ్యక్తులు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఉయ్యాలలోని శిశువు కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు. అయితే చివరకు పక్కనే నివాసం ఉంటున్న బంధువు జ్యోతి ఇంటి మిద్దెపై ఉన్న నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసుగా నమోదు చేశారు.































