గేదె మాంసంలో కరోనా మూలాలు ఉన్నాయని గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవలే ఈ కంటైనర్లను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న మూడు మాంసం కంటైనర్లను నిలిపేసినట్లు ప్రకటించారు. భారత్ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ అయిదు మాంసం కంటైనర్లను పంపినట్టు తెలిపారు. ఇప్పుడు అందులో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

అయితే వారం రోజుల తరువాత ఇందులోని మాంసాన్ని నాశనం చేస్తామని తెలిపారు. ఇక పొతే సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది మొదటిలోనే భారత్ నుంచి దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేశారు.. తాజగా కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ దిగుమతులకు అనుమతి ఇచ్చింది కంబోడియా ప్రభుత్వం.































