Connect with us

General News

చనిపోయిన వారిని మళ్ళి బ్రతికించే పవిత్రమైన హిందు దేవాలయం,ఇది ఎక్కడ ఉంది,దీని చరిత్ర మీఅందరి కోసం..! అందరికి తెలియజేయండి.

Published

on

ఈ విశ్వం లో మనిషి ఏమి చేసిన తన ప్రాణాలను కాపాడుకోవటం కోసమే , ఎన్ని చేసిన ఎదో ఒక రోజు మనిషి ఖచ్చితంగా ప్రాణాలు విడవాల్సిందే అది సృష్టి నియమం. ఎన్ని ప్రయత్నాలు చేసిన చావు నుండి బయటపడలేము. కానీ అదే చావుని కొన్ని నిమిషాలు పాటు అపగల్గితే….. ఏంటి షాక్ లో వున్నారా ,మీరు విన్నది నిజమే, ఏంటి ఇంకా నమ్మలేకపోతున్నారా…. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే వదిలేయండి, మన భారతదేశంలో ఒకటే కాదు ఆశ్చర్యపడే విషయాలు ఎన్నో వున్నాయి అనేది సత్యం. అందులోనూ జీవితంలో ఎప్పుడూ నమ్మలేనటువంటి సంఘటనలు కూడా వుంటాయి.

అటువంటి సంఘటనలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది లఖ్ మండల్. మాకు, మీకు సాధారణంగా తెలీని విషయం ఏమంటే ఆ భగవంతుడు మనుష్యుల ప్రాణాలను ఎప్పుడు ?ఏ విధంగా?తీసుకుంటాడో అతనికి మాత్రమే తెలుసు. అయితే పోయినా ప్రాణం మాత్రం మరలా తిరిగి రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే..అయితే ఈ ఒక్క స్థలంలో మాత్రం పోయిన ప్రాణం కొన్ని నిముషాలపాటు బ్రతికించే శక్తిని కలిగివుందంట. ఇది నిజమో, అబద్ధమో అని మీకు అనిపిస్తూవుంటుంది. అయితే ఈ దేవాలయం ఎక్కడ వుంది? ఆ పుణ్య స్థలం ఏది? ఆ స్థలం యొక్క మహత్యం ఏమిటి?అనే అనేకమైన ప్రశ్నలకు జవాబులను వ్యాసం మూలంగా వివరంగా తెలుసుకొండి.

Advertisement

చనిపోయిన వారిని కొన్ని నిమిషాలపాటు బ్రతికించే ఆ మహిమాన్వితమైన స్థలం ఏది అని ఆలోచిస్తున్నారా?అట్లయితే వినండి ఆ పుణ్యస్థలమే పరమశివుడు వెలసియున్న శక్తివంతమైన దేవాలయం. ఆ దేవాలయం పేరు లఖ్ మండల మందిర్.లఖ్ మండల మందిర్ ఒక పురాతనమైన హిందూ దేవాలయం. మహాశివునికి అర్పితమైన పవిత్రమైన స్థలం. ఈ ఆలయం ఎంతో మహిమ కలదిగా ప్రసిద్ధిచెందింది. ప్రతి మనిషిని అదృష్టం వెంటాడుతుందో లేదో తెలియదుగాని దురదృష్టం ఖచ్చితంగా వెంటాడుతుంది. అందుకోసం ఈ దేవాలయం విశిష్టతలను తెలిసిన ప్రతి ఒక్కరు ఈ దేవాలయాన్ని సందర్శించి తమ దురదృష్టాన్ని దూరం చేసుకుంటారు..

హిందువులు దేవుళ్ళుగా కొలిచే పాండవులు అజ్ఞాతవాసంలో వున్నప్పుడు కొన్ని రోజులపాటు ఈ స్థలంలో కాలంగడిపారని చెప్పుకొంటారు. పాండవులు కాలిడిన పవిత్రమైన స్థలం ఇది అని చెప్పవచ్చును. లఖ్ మండల్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. లఖ్ అంటే “అనేకం” మరియు మండల్ అంటే “దేవాలయం” లేదా “లింగం” అనే అర్థాన్ని కలిగివుంది.ఇక్కడ భారతదేశం యొక్క పురాతత్త్వశాస్త్ర సమీక్షకు సంబంధించిన కళాత్మకమైన కృతులు ఇక్కడ చూడవచ్చును.ఈ దేవాలయం ముఖ్యమైన ఆకర్షణ ఏమంటే అది గ్రానైట్ తో చేయబడిన లింగం. చుట్టుపక్కల ఆ లింగం యొక్క ప్రకాశానికి ఎంతో అందంగా కనపడుతుంది. ఆ లింగాన్ని చూసిన భక్తులు ఎంతో భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు.

ఇంతకూ ఈ దేవాలయం ఎక్కడ వుంది అని ఆలోచిస్తున్నారా?అలాగయితే వినండి ఈ మహిమాన్విత దేవాలయం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో జాన్సర్ బవర్ ప్రదేశంలో వుంది.ఈ దేవాలయాన్ని ఉత్తరాఖాండ్ శైలిలో నిర్మించటం జరిగింది.ఈ దేవాలయానికి వెళ్ళే మార్గం ఏమిటంటే ….!లఖ్ మండల మందిర్ చక్రతా నుండి సుమారు 100కిమీ ల దూరం వుంది.రోడ్డు మార్గం ద్వారానైతే మొదటగా ప్రయాణికులు చక్రతాకి వెళ్లి అక్కడి నుండి సులభంగా లఖ్ మండల్ బస్సు లేదా టాక్సీద్వారా చేరవచ్చును. సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి లఖ్ మండల్ సుమారు 107కిమీ లు దూరాన వుంది.సమీపంలోని విమానాశ్రయం సు జాలి గ్రాంట్ విమానాశ్రయం.ఇక్కడి నుండి లఖ్ మండల్ కి సుమారు 130కిమీ ల దూరం వుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!