అంతులేని కథ చిత్రాన్ని నిర్మించిన “ఆండాలు ప్రొడక్షన్స్” వారు ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మళ్లీ బాలచందర్ తో ఓ చిత్రాన్ని నిర్మిద్ధామనుకున్నారు. ఆ క్రమంలో ఈసారి ఫ్యామిలీ సెంటిమెంట్ కాకుండా ఒక ప్రేమ కథ చిత్రం రూపొందించాలనుకున్నారు. అంతులేని కథ చిత్రానికి సంభాషణలు రాసిన ఆత్రేయను కాకుండా ఈసారి ఆయన స్థానంలో గణేష్ పాత్రోను తీసుకున్నారు. అంతులేని కథ సినిమాలో నటించిన కమల్ హాసన్ ని హీరోగా తీసుకుందామని ఆయనను సంప్రదించగా.. అప్పటికే ఆయన దర్శకరత్న దాసరి దర్శకత్వంలో కన్యాకుమారి చిత్రాన్ని ఒప్పుకొని షూటింగ్ కి సిద్ధంగా ఉన్నారు.
ఆ క్రమంలో తన గురువుగారైన బాలచందర్ ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెప్పడంతో దాసరి తను తీస్తున్న కన్యాకుమారి సినిమాని వాయిదా వేసుకొని కమల్ హాసన్ మరో చరిత్ర లో నటించడానికి అవకాశం కల్పించారు. హీరోయిన్ గా ముందుగా జయప్రదను అనుకున్నారు. కానీ అప్పటికే ఆమె తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత “అక్బర్ సలీమ్ అనార్కలి” హీరోయిన్ దీపను సంప్రదించారు. ఆమె కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఓ కొత్త హీరోయిన్ కొరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా దాదాపు ఎంతో మందిని ఆడిషన్స్ నిర్వహించగా చివరికి సరితను హీరోయిన్ గా తీసుకున్నారు. సరిత నల్లగా పొట్టిగా ఉన్న కూడా.. ఆమెలో ఉన్న చురుకుదనం చూసి బాలచందర్ ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత ఈ సినిమాకి టైటిల్ ఏదైతే బాగుంటుందని దర్శక, రచయితలు ఆలోచించారు. అంతులేని ప్రేమ కథ, మరో ప్రేమకథ ఇలాంటి టైటిల్స్ పరిశీలనలో ఉండగా… చిత్ర నిర్మాత చరిత్రలో నిలిచిపోయే ప్రేమకథ కావున చరిత్ర అని అర్థం వచ్చే టైటిల్ వుండాలని ఈ సినిమాకి మరో చరిత్ర అనే టైటిల్ని చివరికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కొరకు విశాఖపట్నం, భీమునిపట్నం, అరకు లాంటి ప్రాంతాల్లో పర్యటించి చివరికి ఆ లొకేషన్స్ ని దర్శకనిర్మాతలు ఓకే చేశారు. అలా వారంతా విశాఖపట్నంలో అప్సర హోటల్ లో బసచేశారు. వీరు తమిళనాడుకు సంబంధించిన వారు కాబట్టి అక్కడివారిని వంట చేయడానికి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. సినిమా మొత్తం ఎక్కువగా ఉదయం వీలైతే సాయంత్రం షూటింగ్ చేయడం జరిగింది.
1970 చివరి దశకంలో దాదాపు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కనుమరుగవుతున్న సమయంలో వచ్చిన ప్రేమ కథా చిత్రమే మరో చరిత్ర. 1978 మే 19న కళా దర్శకుడు బాలచందర్ మేధోమదనం నుంచి జాలువారిన మరో చరిత్ర విడుదలై ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఇదే సినిమాని డబ్బింగ్ చేయకుండా చెన్నైలో విడుదల చేస్తే ఏకంగా 500 రోజుల కంటే ఎక్కువగా ప్రదర్శింపబడింది. అలాగే హిందీలో లో కమల్ హీరో గా బాలచందర్ దర్శకత్వంలో “ఏక్ దూజే కే లియే” అనే సినిమాగా రీమేక్ కాబడి అద్భుత విజయాన్ని సాధించింది.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.