Connect with us

Featured

నందుల పంట పండిన “సిరివెన్నెల” సినిమా.. ఓ క్లాసికల్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.!!

Published

on

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…”విరించినై విరచించితిని ఈ కవనం.. ప్రాగ్ధిశ వీనియా పైన దినకర మయూఖ తంత్రులపైన”… వేదాలు, ఇతిహాసాల కలయిక భరత ఖండం.. సిరివెన్నెల చిత్రం సినీజగత్తులో ఓ అద్భుతమైన కళాఖండం. ఆ చిత్రం శాస్త్రీయసంగీత సమ్మేళనం.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓ అమృతభాండం. అది తేనెలొలుకు ఓ తెలుగు పాట, దేశభాషలందు తెలుగు లెస్స.. అనడానికి ఈ ఒక్క పాట వింటే చాలు తెలుగుపై మమకారం, నుడికారం ఇట్టే అర్థమైపోతుంది. ఇందులోని అన్ని పాటలు చిరకాలం గుర్తుండిపోయే ఆణిముత్యాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అప్పటివరకు ఉన్న సినీగేయ, గీత గమనాన్ని మార్చిన ప్రసిద్ధ గేయ రచయిత సీతారామశాస్త్రి. ఈ సినిమాకి గీతాలు రాయడం వలన ఆయనకి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పేరు వచ్చింది. సినిమాలకి పాటలు రాయడం సిరివెన్నెల సినిమాతోనే మొదలు పెట్టినప్పటికీ ఈ చిత్రంలోని గీతాలలో ఉన్న లాలిత్యం, మాధుర్యం అనన్య సంక్రామకత్వం, అజరామరం. విధాత తలపున.. అనే పాట రాయడానికి గేయ రచయిత సీతారామశాస్త్రికి సుమారుగా వారం రోజుల సమయం తీసుకుంది. భారతీయ సంగీత కళలను ప్రధాన కేంద్రబిందువుగా తీసుకుని సంగీత ప్రియులను అబ్బురపరిచేలా సిరివెన్నెల చిత్రాన్ని వెండితెర దృశ్యకావ్యంగా మలచి భారతీయ చలనచిత్ర కీర్తి పతాకాన్ని ఎగురవేసిన దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న చిత్రాల పరంపరలో ఆయన మేధోమదనం నుంచి జాలువారిన మరో సంగీత సాహిత్య ప్రాధాన్యమున్న “చిత్రం” సిరివెన్నెల.

1986 పూర్ణోదయ పిక్చర్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మున్ మున్ సేన్ హీరో, హీరోయిన్లుగా సిరివెన్నెల చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్ర కథ అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూగదైన చిత్రకారిణి మధ్య చుట్టూ తిరిగే కథ. బెంగాలి నటుడు సర్వదమన్ బెనర్జీని ఆదిశంకరాచార్య, శ్రీ దత్త దర్శనం అనే చిత్రాల్లో చూసిన కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో హీరోగా తీసుకున్నారు. తెలుగు తెరకు కొత్తగా పరిచయం అయినప్పటికీ నటుడు సాయి కుమార్ ఆయనకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాజస్థాన్లోని జైపూర్ లో జరిగింది.

జైపూర్ పర్యాటకశాఖ వారు ముందుగా ఈ సినిమా షూటింగ్ కి కేంద్ర అనుమతి కావాలని కోరగా.. అప్పుడు అజ్మీర్ జిల్లా కలెక్టర్ అంతకుముందే శంకరాభరణం సినిమా చూడడం వలన కె.విశ్వనాథ్ ను గుర్తు పట్టి… ఈ సినిమా షూటింగ్ కి తొందరగా అనుమతి ఇవ్వడం జరిగింది. అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలైన అనంతరం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ నంది బహుమతులతో సినిమా తెలుగు సాహిత్య కీర్తి బావుటాను ఎగురవేసింది. నంది ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, నంది ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, నంది ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఎం.వి.రఘు, నంది ఉత్తమ సహాయనటి మునుమును సేన్ లు పొందారు. ఈ సంవత్సరం నంది అవార్డులతో సిరివెన్నెల సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!