బండ్ల గణేశ్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే బండ్ల గణేశ్.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు నిర్మాతగా మారి.. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన సినిమాలను నిర్మించారు. అయితే.. బండ్ల గణేశ్ ను అందరూ బొత్స సత్యనారాయణ బినామీ అంటుంటారు. అసలు.. బొత్సకు, బండ్ల గణేశ్ కు సంబంధం ఏంటి? అనేది చాలామందికి తెలియదు.
Advertisement
బొత్స సత్యనారాయణకు నేను బినామీని కాదు. నేను ఆంధ్రా బ్యాంకుకు బినామీని. ఎందుకంటే.. ఆంధ్రా బ్యాంకు నుంచి నేను లోన్ తీసుకొని సినిమాలు నిర్మిస్తుంటా. నేను సినిమాలు నిర్మిస్తున్న సమయంలోనే బొత్స సత్యనారాయణ పరిచయం అవడం.. ఆయనతో చాలాసార్లు మాట్లాడటంతో.. అందరూ నన్ను ఆయన బినామీని అనుకున్నారు కానీ.. నేను ఆయన బినామీని కాదు. ఇప్పటికీ ఇంకా నన్ను ఆయన బినామీగానే అనుకుంటున్నారు అంటూ అసలు నిజం చెప్పుకొచ్చారు బండ్ల గణేశ్.
సుస్వాగతం సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడింది
బండ్ల గణేశ్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. దానికి కారణం.. పవన్ కు, బండ్ల గణేశ్ కు మధ్య ఉన్న అనుబంధం. అయితే.. బండ్ల గణేశ్.. పవన్ కళ్యాణ్ మధ్య పరిచయం ఏర్పడింది ఎప్పుడో తెలుసా? సుస్వాగతం సినిమా సమయంలో. ఆ సినిమాతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. అది అలాగే.. కంటిన్యూ అయిందట. తర్వాత బండ్ల గణేశ్ ఏదైనా సినిమా తీస్తావా? నిర్మాతగా మారుతావా? అని అనగానే.. బండ్ల గణేశ్ ఎగిరి గంతేసి.. పవన్ తో సినిమాలు తీయడం మొదలు పెట్టారట. అలా.. బడా నిర్మాతగా బండ్ల గణేశ్ మారారు.
చిన్నప్పటి నుంచి సినిమా అంటే వ్యసనం
చిన్నప్పటి నుంచి సినిమాలంటే మాత్రం చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యసనం. మాది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే. మాకు అప్పట్లోనే పౌల్ట్రీ ఫామ్ లు ఉండేవి. అయితే.. నాకు మాత్రం సినిమాల్లోకి రావాలని.. నటుడు కావాలని కోరిక ఉండేది. అలా సినిమాల్లోకి వచ్చా. ముందు కేఎస్ రామారావు దగ్గర మేనేజర్ గా పనిచేశా. అక్కడ జీతం లేకుండా పనిచేశా. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి నాకు వేషాలు ఇచ్చారు. అలా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా అడుగు పెట్టా.. అని బండ్ల గణేశ్ తెలిపారు.
ఇన్ కమ్ ట్యాక్సే కోట్లు కట్టాను
బండ్ల గణేశ్ అప్పట్లో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించి బాగా లాభాలు సంపాదించారు. ఆయన తీసింది మొత్తం 8 సినిమాలు. పవన్ కళ్యాణ్ తో 2 సినిమాలు, ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, అల్లు అర్జున్ తో ఒక సినిమా, రవి తేజతో ఒకటి, రామ్ చరణ్ తో ఒకటి సినిమా నిర్మించి బడా నిర్మాతగా మారారు బండ్ల గణేశ్. అయితే.. బండ్ల గణేశ్.. ఈ సినిమాలు నిర్మించిన తర్వాత కోట్లు సంపాదించి ఇన్ కమ్ ట్యాక్స్ కట్టలేదని ఇన్ కమ్ టాక్స్ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారు. అయితే.. ఇన్ కమ్ ట్యాక్స్ 10 కోట్లు కట్టారట బండ్ల గణేశ్. త్వరలోనే మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నారట బండ్ల గణేశ్.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.