కింగ్ నాగార్జున.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కినేని ఫ్యామిలీ అంటేనే అందం, అభినయంతో ఆకట్టుకుంటారు. అక్కినేని నాగేశ్వరరావు టైమ్ నుంచి ఇప్పటి అఖిల్ వరకు.. ఆ ఫ్యామిలీలోని ప్రతి హీరో అందగాడే. అక్కినేని నాగేశ్వరరావు కూడా అప్పట్లో అందగాడే. ఆయనకు ఆ కాలంలోనే మహిళల ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన తర్వాత ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు కూడా మహిళల ఫాలోయింగ్ ఎక్కువ. టాలీవుడ్ కే ఆయన మన్మథుడు. ఆయన వయసు ఇప్పుడు ఆరు పదులు దాటినా కూడా ఇప్పటికీ ఆయన యువకుడిలా కనిపిస్తారు. అలా కనిపించాక.. ఎవరు మాత్రం పడిపోరు చెప్పండి. అందుకే.. టాలీవుడ్ లోనే ఎక్కువ మహిళల ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే.. టక్కున నాగార్జున అని చెప్పొచ్చు.
నాగార్జున తర్వాత మళ్లీ అంతే మహిళల ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు నాగ చైతన్య. అఖిల్ కూడా అంతే. తండ్రికి తగ్గ తనయుల్లా.. తమదైన శైలిలో సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. అయితే.. మహిళల ఫాలోయింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కిక్ ఇస్తుందట.. మన మన్మథుడికి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని నాగార్జున.. ఓ ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పారు.
ఉమెన్ ఫాలోయింగ్ పై మీ అభిప్రాయం ఏంటి?
Advertisement
ఉమెన్ ఫాలోయింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా.. ఉమెన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం నా అదృష్టం. ఇండస్ట్రీలో నాకు ఎక్కువగా ఉండటం కంటే కూడా.. ఉమెన్ ఫాలోయింగ్ ఉండటం అనేది నాకు ఎక్కువ కిక్ ఇస్తుంది. అదే నాకు ప్లస్ కూడా. నాకు ఇంత అందం వచ్చింది అంటే అది కేవలం నాన్న వల్లనే అంటూ చెప్పుకొచ్చారు కింగ్ నాగార్జున.
నాగ చైతన్యకు కూడా ఉమెన్ ఫాలోయింగ్ ఎక్కువే
అమ్మాయిల ఫాలోయింగ్ కేవలం ఒక్క నాగార్జునకే కాదు.. ఆయన కొడుకు నాగ చైతన్యకు కూడా ఎక్కువే అని తెలుసు కదా. ఆ విషయాన్ని నాగార్జున కూడా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన కొడుకుకు కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం తనకు కూడా సంతోషాన్ని కలిగిస్తోందని నాగార్జున చెప్పుకొచ్చారు.
బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా
నేను చదువుకునే రోజుల్లో నాకు యాక్టింగ్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంజినీరింగ్ చేశా. ఆ తర్వాత బిజినెస్ చేయాలనేది నా ప్లాన్. ఫారిన్ లో చదువుకొని వచ్చాక.. బిజినెస్ చేద్దామని అనుకున్నా. ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామనుకున్నా కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ సమయంలో ఖాళీగా ఉండలేక నాన్న సినిమాల షూటింగ్ లకు వెళ్లేవాడిని. ఆ సమయంలో అన్న వెంకట్.. సినిమాల్లోకి వెళ్తావా? అని అడిగారు. అప్పుడు నేను నాన్నకు ఆ విషయం చెప్పా. నాన్న కూడా ఓకే చెప్పడంతో.. అలా సినిమాల్లోకి వచ్చేశాను. ఆ తర్వాత కంటిన్యూగా సినిమాల్లో నటించడం, హీరో అవడం.. జరిగిపోయింది.. అని నాగార్జున చెప్పుకొచ్చారు. అలా బిజినెస్ చేయకుండా.. సినిమాల్లోకి వచ్చేశారు నాగార్జున.
అమలకు ముందు నేనే ప్రపోజ్ చేశా
Advertisement
నాగార్జున, అమలది ప్రేమ వివాహం అని అందరికీ తెలుసు కదా. అయితే.. వాళ్ల ప్రేమ పట్టాలెక్కడానికే కనీసం 5 ఏళ్లు పట్టిందట. అయితే.. ముందు అమలకు.. నాగార్జునే ప్రపోజ్ చేశారట. కాకపోతే… తనకు ప్రపోజ్ చేయడానికి 5 ఏళ్లు వెయిట్ చేశారట. అయితే.. నాగార్జున ప్రపోజ్ చేయగానే.. అమల బోరున ఏడ్చేసిందట. ఆ తర్వాత తను కూడా ఒప్పుకుందట. అలా.. అమల, నాగార్జున ఒక్కటయ్యారు అన్నమాట.
Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.
Advertisement
ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత.. ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Advertisement
రోడ్డుపై పడ్డాను.. తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
హోం శాఖ మంత్రి.. ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.