కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. దానికి కారణం.. ఆయన నటించిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనే సినిమా ఇటీవలే విడుదలై.. విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ కావడంతో కిరణ్.. ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నా.. ఈ సమయంలో ఈ సినిమా రిలీజ్ కావడంతో.. జనాలు థియేటర్ కు వస్తారా? రారా? అనే ఒక సందేహం ఉండేది. కానీ.. సినిమా బాగుంటే.. ప్రేక్షకులు ఎలాగైనా ఆదరిస్తారు.. అనే విషయం మరోసారి రుజువు అయింది.
సినిమాలో కంటెంట్ ఉండాలి.. కానీ.. సునామీ వచ్చినా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తాజాగా అదే జరిగింది. తన సినిమా సూపర్ సక్సెస్ అవడంతో.. కిరణ్ అబ్బవరం.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి, ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ నేనే రాశా
Advertisement
నిజానికి ఏ సినిమా హీరో కూడా కథ రాయడు. కథలు రాసే హీరోలు అరుదుగా ఉన్నారు. అందులో ఒకరే కిరణ్ అబ్బవరం. ఎందుకంటే.. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినమా స్టోరీని, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నింటిని రాసింది కిరణే. కిరణ్ మల్టీ టాలెంటెడ్. అందుకే.. నటనలోనూ ఆయన బాగానే రాణిస్తున్నాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆయన నటనకు కూడా బాగానే మార్కులు పడ్డాయి.
నా మొదటి సినిమా రాజా వారు రాణీ గారు
ఎస్ఆర్ కళ్యాణ్ మండపం.. కిరణ్ అబ్బవరంకు రెండో సినిమా. ఎందుకంటే.. అంతకు ముందే రాజా వారు రాణీ వారు అనే సినిమాలో హీరోగా నటించాడు. అదే ఆయన మొదటి సినిమా. అయితే.. ఆయన ఇండస్ట్రీలో ఇప్పటికి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్ని షార్ట్ ఫిలింస్ లో కూడా నటించినప్పటికీ.. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఆడిషన్ ఇవ్వలేదట కిరణ్ అబ్బవరం. ఆయనకు డైరెక్ట్ గా సినిమా అవకాశాలు వచ్చాయట. ఎవ్వరు కూడా ఆడిషన్ తీసుకోలేదని ఇంటర్వ్యూలో తెలిపాడు.
పవన్ కళ్యాణ్ నా ఫేవరేట్ హీరో
కిరణ్ కు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ఆయన స్మయిల్ అంటే చాలా ఇష్టమట. ఖుషీ, జానీ.. లాంటి సినిమాలంటే చాలా ఇష్టమట. అలాగే.. ఆది, సింహాద్రి సినిమాలన్నా ఇష్టమట. మహేశ్ బాబు ఒక్కడు సినిమా కూడా ఇష్టం అని చెప్పాడు కిరణ్. హీరోయిన్లలో సిమ్రాన్ అంటే ఇష్టమట.
కిరణ్ అబ్బవరం.. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో పాటు.. వానర సైన్యం అనే ఓ షార్ట్ ఫిలింకు కూడా కథ రాశాడట. గచ్చిబౌలి అనే షార్ట్ ఫిలింలో కూడా నటించాడు కిరణ్.
చిన్నప్పటి నుంచి అందరు హీరోల సినిమాలు చూస్తూ పెరిగా. మనకు ఎలాంటి సినిమా అయితే నచ్చుతుంది. ఎలాంటి క్యారెక్టర్ అయితే నచ్చుతుంది. ఎలాంటి సీన్స్ వస్తే విజిల్స్ వేస్తామో.. మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అదే క్లారిటీతో నేను స్టోరీలు రాశాను. అంతే కానీ.. నాకు ఇండస్ట్రీలో ఎటువంటి అనుభవం లేదు. నేను చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలనే ఇన్సిపిరేషన్ గా తీసుకొని వాటినే నా సినిమాల్లో అప్లయి చేస్తా.. అని చెప్పుకొచ్చారు కిరణ్.
ఈ సినిమాలో సాయి కుమార్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్
Advertisement
ఈ సినిమాలో సాయి కుమార్ చేసిన క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సాయి కుమార్ ఇప్పటి వరకు తన సినిమా కెరీర్ లో అటువంటి క్యారెక్టర్ చేయలేదు. ఆయనకు కూడా ఈ రోల్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ క్యారెక్టర్ కు ప్రతి ఒక్క తండ్రి, కొడుకు కనెక్ట్ అవుతారు.. అంటూ కిరణ్ చెప్పారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.