Connect with us

Featured

ప్రదీప్‌కు వైజాగ్‌ నుండి పెళ్లి సంబంధం.. కట్నం ఎంతో తెలిస్తే షాక్‌.. ప్రదీప్‌ సమాధానం ఏంటో తెలుసా?

Published

on

ఇటీవల బుల్లి తెరపై యాంకర్‌ ప్రదీప్‌ స్టార్‌ అయ్యాడు. గత రెండు సంవత్సరాలుగా బుల్లి తెరపై సంచలనాలు సృష్టిస్తున్న ప్రదీప్‌కు హీరో రేంజ్‌లో గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఈయన చేస్తున్న కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్‌ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే ఆ షోను ప్రధీప్‌ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఆ షోతో పాటు ఎన్నో రియాల్టీ షోలను, గేమ్‌ షోలను హోస్ట్‌ చేస్తున్న ప్రదీప్‌ నెలకు 25 నుండి 30 లక్షలు సంపాదిస్తున్నట్లుగా బుల్లి తెర వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రదీప్‌ భారీ స్థాయిలో సంపాదిస్తున్న నేపథ్యంలో ఆయనకు పిల్లను ఇచ్చేందుకు ఎంతో మంది క్యూ కడుతున్న విషయం తెల్సిందే..

Advertisement

ప్రదీప్‌ తన పెళ్లి గురించి ఎక్కువ షోల్లో జోకులు వేసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదని, కొందరు అమ్మాయిలు నన్ను తిరష్కరించారు అంటూ జోకులు వేస్తూ ఉంటాడు. కాని ప్రదీప్‌కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు.ప్రదీప్‌ ఎక్కడ ఏ షో చేసినా కూడా లేడీస్‌ ఫ్యాన్స్‌ ఎక్కువా ఉంటారు. ఆయన చేసే ప్రతి షోను అమ్మాయిలు ఎక్కువ శాతం చూస్తారు. బుల్లి తెరపై అత్యధిక లేడీస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తి ప్రదీప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రదీప్‌ ప్రస్తుతం లెక్కకు మించిన షోు చేస్తున్నాడు.

సినిమాల్లో కూడా అడపా దడపా కనిపిస్తున్నాడు. ఇక ప్రదీప్‌కు కుటుంబ సభ్యులు వివాహం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గత సంవత్సర కాలంగా ప్రదీప్‌కు బాగా సెట్‌ అయ్యే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌ నుండి ఒక ప్రముఖ రియల్టర్‌, వ్యాపారవేత్త తన కూతురును ప్రదీప్‌కు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఆయన ప్రదీప్‌ తల్లిదండ్రులతో మాట్లాడటం కూడా జరిగిందట. ప్రస్తుతం అమెరికాలో ఎమ్మెస్‌ చేస్తున్న తన కూతురును ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటే 5 కోట్ల కట్నంతో పాటు విశాఖపట్నంలో ఖరీదైన ఏరియాలో ఉన్న రెండు ఫ్లాట్‌లను సైతం ఇస్తానన్నాడట.తన కూతురుకు ప్రదీప్‌ అంటే ఇష్టం అని, అందుకే కట్నం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అంటూ ప్రదీప్‌ తల్లిదండ్రులను ఆయన ఒప్పించే ప్రయత్నం చేశాడట. కాని ప్రదీప్‌ మాత్రం ఆ అమ్మాయిని తిరష్కరించాడు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదంటూ ఆయన ఇచ్చిన ఆఫర్‌ను పక్కకు పెట్టాడట.

Advertisement

పెళ్లి చేసుకోవాలని ప్రదీప్‌ భావిస్తున్నా కూడా ఆయన ఇచ్చిన ఆఫర్‌ను ఎందుకు తిరష్కరించాడని బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక వేళ అమ్మాయి ప్రదీప్‌కు నచ్చి ఉండకపోవచ్చు అంటూ కొందరు అంటున్నారు. కట్నం కంటే అమ్మాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కూడా ప్రదీప్‌ ఆమెను వద్దని ఉంటాడని కొందరు అంటున్నారు.


మరి కొందరు మాత్రం ప్రదీప్‌ ప్రేమలో ఉన్నాడని, అందుకే తల్లిదండ్రులు చూస్తున్న ఏ సంబంధంకు ప్రదీప్‌ ఓకే చెప్పడం లేదని అంటున్నారు. మరో రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటాడని తాజాగా ఒక యాంకర్‌ చెప్పుకొచ్చాడు.ప్రదీప్‌కు చాలా క్లోజ్‌గా ఉండే ఆ యాంకర్‌ ఇంకా మాట్లాడుతూ ప్రదీప్‌కు పెళ్లిపై చాలా క్లారిటీ ఉంది, ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాడని తాను భావిస్తున్నాను అన్నాడు. ప్రదీప్‌ ప్రేమ విషయంపై ఆయన మాట్లాడేందుకు తిరష్కరించాడు.ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నకు నవ్వేశాడు. మొత్తానికి ప్రదీప్‌ హీరో రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన పెళ్లి గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!