సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ పెద్ద మాయా ప్రపంచం. దూరపు కొండలు నునుపు అనడానికి ఉదారహరణగా ఈ రంగుల ప్రపంచాన్ని చూపించవచ్చు. ఇక్కడ అందరికీ అన్నీ దొరకవు. దొరికినా లాగేసుకునేవాళ్ళే ఎక్కువమంది ఉంటారు. సక్సెస్ ఉంటేనే హీరోకైనా, డైరెక్టర్కైనా.. మరెవరికైనా క్రేజ్. లేదంటే ఎంత చులకనగా చూడాలో అంత చులకనగా చూస్తారు. నీ టాలెంటే నీ పెట్టుపడి. నీ దమ్ము ధైర్యమే నీ ఆయుధం అనే వాటిని నమ్ముకొని టాలీవుడ్ ఇండస్ట్రీకొచ్చి అద్భుతమైన విజయాలను అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన ఏ కథ చెప్పాలన్నా ఎంతో ధైర్యంగా చెప్తాడు. ఎలాంటి టైటిల్ పెట్టాలన్నా ఎవరినీ లెక్కచేయరు.
ఇన్నేళ్ళ చిత్ర పరిశ్రమలో ఏ అగ్ర దర్శకుడు సంపాదించనంత డబ్బు, పేరు సంపాదించాడు. అందుకే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీని సంపాదించాడు. బద్రి సినిమాతో దర్శకుడిగా మారిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ తీసి టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్గా మారాడు. ఆయన క్రేజ్ చూసి నిర్మాతలు, హీరోలు తన దర్శకత్వంలో సినిమా చేయాలని పడిగాపులు కాచిన రోజులున్నాయి. పూరి జగన్నాథ్ ఈ స్థాయికి రావడానికి కారణం. మార్గ దర్శకులు తన తల్లిదండ్రులే. వారే పాతిక వేలిచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు అక్కడ బాగుపడతావని చెప్పి పంపించారు.
అలాంటి ప్రోత్సాహం మళ్ళీ తన భార్య లావణ్య ఇచ్చారు. ఆవిడ ఇచ్చిన సపోర్ట్ నిజంగా పూరి కెరీర్ లో మళ్ళీ అసాధారణ స్థాయికి చేరుకునేలా చేసింది. పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా అనే సినిమాను తీశారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ సమయంలో ఆస్తులను పోగొట్టుకున్నాడు. నమ్మిన స్నేహితుడే దాదాపు 80 కోట్ల పైనే మోసం చేశాడు. తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ పోవడంతో పెంచుకుంటున్న కుక్కలకి కూడా ఫీడింగ్ ఇవ్వలేక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. తన ట్రైనర్ కి ఇచ్చి పంపేసిన పూరి ఓ చిన్న అద్దె ఇంట్లోకి మారాడు. ఒక్కసారిగా భారీ సక్సెస్ లు చూసి రోడ్డున పడితే ఎవరైనా అక్కున చేర్చుకుంటారు.
కానీ పూరి జగన్నాథ్కి ఆ సమయంలో అండగా నిలిచి సపోర్ట్ ఇచ్చిన వారెవరూ లేరని స్వయంగా వెల్లడించాడు. అలాంటి సమయాలలోనే అందరి అసలు రంగు బయట పడుతుందని చెప్పుకొచ్చిన పూరి తను బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఏ హీరో పట్టించుకోలేదని.. ఒక్క భార్య మాత్రమే నాకు అన్ని విధాల తోడుగా నిలిచిందని వెల్లడించాడు. అయితే స్టార్ కమెడియన్ అలీ ఒక నగ తీసుకువచ్చి పూరి చేతిలో పెట్టి ఇది నీ దగ్గర పెట్టుకో నువ్వు పోగొట్టుకున్నవన్ని మళ్ళీ తిరిగొస్తాయని చెప్పాడు. దేవుడుని, ఇలాంటి వాటిని నమ్మని పూరి.. ఆ నగ తన భార్య లావణ్యకిచ్చి ఇలా అలీ ఇచ్చాడు అని చెప్పాడు. అలీ చెప్పినట్టుగానే పూరి పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగొచ్చాయి.
పడిలేచిన కెరటంలా పూరి జగన్నాథ్ మళ్ళీ బ్లాక్ బస్టర్స్ తీసుకున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో కొడుకుతో పాటు విజయ్ దేవరకొండతో తీసుకున్న లైగర్ సినిమా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ లైఫ్ ఇండస్ట్రి వారికే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఎంతో సన్నిహితంగా ఉండే పూరి జగన్నాథ్ ఆయన వద్ద కూడా సహాయం తీసుకోవాలంటే ఇబ్బందిగా ఫీలవుతాడు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.