Connect with us

Movie News

మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు.. పవన్ కల్యాణ్ కూతురు ఏడుపు.. అంబులెన్స్ సిద్ధంగా..

Published

on

ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులు. రేణు బహుముఖ ప్రజాశాలి. సినీరంగంలో హీరోయిన్‌గానే కాకుండా ఎడిటింగ్, డైరెక్షన్, రైటింగ్ విభాగంలో మంచి పట్టు ఉంది.తాజాగా రేణు దేశాయ్ మరో పాత్రలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొఫెషనల్, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. రేణుదేశాయ్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

నీతోనే డ్యాన్స్‌ షోలో మా టెలివిజన్ నిర్వాహకులు ఒకరోజు ఫోన్ చేసి నీతోనే అనే డ్యాన్స్ షో ప్లాన్ చేస్తున్నాం. మీరు న్యాయనిర్ణేతగా వ్యవహరించాలి. ఆ కార్యక్రమం హిందీలో ప్రసారమయ్యే నాచ్‌బలియే అనే ప్రొగ్రాంగా ఉంటుంది అని చెప్పారు. అయితే నేను కొంత తటపటాయించాను. ఎందుకంటే టెలివిజన్ మాధ్యమం నాకు చాలా కొత్త. ఆ తర్వాత వాళ్ల ఒత్తిడి మేరకు అంగీకరించాను.

Advertisement

నీతోనే షో ప్రొగ్రాం తొలి రోజు షూట్‌‌లో అడుగుపెట్టగానే చాలా భయం కలిగింది. ఎందుకైనా మంచిది నాకు హార్ట్ ఎటాక్ వస్తే తీసుకెళ్లడానికి అంబులెన్స్ రెడీగా పెట్టుకోండి అని అన్నాను. అందుకు వారు నవ్వి మీకు ఏమీ కాదు అని భరోసా ఇవ్వడంతో.. మొదటి రోజు సెట్‌లో అడుగుపెట్టగానే చాలా భయమేసింది. అంబులెన్స్‌ సిద్ధం చేసుకోండి… నాకు హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమో అని అన్నా. చుట్టూ ఉన్న వాళ్లందరూ నవ్వారు. ‘ఏం కాదు మేడమ్‌! మీరు ఈజీగా చేసేయొచ్చు’ అని అన్నారు. కానీ నేను అంత తేలిగ్గా తీసుకోలేకపోయా. హార్ట్‌బీట్‌ నార్మల్‌ కావడానికి కొంత సమయం పట్టింది.

సింగిల్ పేరెంట్ (భర్త నుంచి విడిపోయి) జీవితం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన పూర్తి బాధ్యత చూడాల్సి ఉంటుంది. సమాజంలో పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూస్తే చాలా భయంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు నా పిల్లలను స్కూల్లో వదిలిపెట్టడం లాంటివి చేస్తుంటాను.

కొద్ది రోజుల క్రితం నా ఆరోగ్యం విషమించింది. అప్పుడప్పుడూ నాకు జ్వరం వచ్చేది. పని ఒత్తిడి వల్ల వచ్చే జ్వరం అనుకొని తేలికగా తీసుకొన్నాను. కానీ ఆరోగ్య పరిస్థితి చేజారింది. హాస్పిటల్ వెళ్తే ఆర్తోఇమ్యూన్ కండిషన్ అని డాక్టర్లు చెప్పారు. గుండెలో సమస్య ఉందని చెప్పారు. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.అనారోగ్యంతో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. ఇంట్లో ఉంటే బెడ్ మీద లేదంటే హాస్పిటల్‌లో ఉండే దానిని. నా పరిస్థితి చూసి పిల్లలు చాలా భయపడ్డారు. ఆందోళన చెందారు. కానీ దేవుడు నా పిల్లల పరిస్థితి అర్థం చేసుకొని మామూలు మనిషిని చేశాడు.

Advertisement

ఒకరోజు నా కూతురు ఆద్యా స్కూల్ నుంచి వచ్చి బెడ్‌పై ఉన్న నన్ను లేపడానికి ప్రయత్నించింది. ట్యాబెట్లు వేసుకోవడంతో గాఢ నిద్రలో మునిగిపోయాను. నేను ఎంతకు లేవకపోవడంతో ఆద్య భయపడిపోయింది. నా పక్కన కూర్చొని ఏడుస్తూ కనిపించింది. వెంటనే నీ ఒడిలోకి చేరి ‘ప్లిజ్ మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు అని ఒకటే ఏడుపు. అలా నా కూతురు ఏడుస్తుంటే గుండె పగిలినంత పనైంది.ఆద్య పరిస్థితి చూసి నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. కానీ నేను ఏడిస్తే పాప భయపడుతుంది అని.. కంట్రోల్ చేసుకొన్నాను. పిల్లలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాను. నేను చచ్చిపోను. నీతోనే ఉంటాను అని వారికి చెప్పడంతో వారికి ధైర్యం కలిగింది. ఆ తర్వాత ‘మమ్మీని అంత త్వరగా తీసుకెళ్ళొద్దు! మమ్మీ చచ్చిపోకుండా చూసుకో అని భగవంతుడికి దణ్ణం పెట్టుకో..’ అని చెప్పాను.

అలాంటి పరిస్థితుల్లో అంతకు మించి నాకు మరేది తోచలేదు. ఆ తర్వాత ఆద్య దేవుడి ముందు ఎంతసేపు కూర్చుందో నాకు తెలియలేదు. నేనే కాస్త ఓపిక తెచ్చుకుని లేచి వెళ్లి.. ‘అసలు నేను చచ్చిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చచ్చిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?’ అని చెప్పి ఆద్యలో సంతోషాన్ని నింపాను.నా కుమారుడు అకీరా కొంత మానసికంగా పరిణితి చెందాడు. పరిస్థితులను అర్థం చేసుకొంటాడు. అనారోగ్యం సమయంలో స్కూల్‌కి వెళ్లే ముందు నాతో కాసేపు కూర్చుని మాట్లాడేవాడు. స్కూల్‌ నుంచి వచ్చాక మాత్రలు వేసుకున్నావా అని అడిగేవాడు. హాస్పిటల్‌కి వెళ్లాల్సిన తేదీలను గుర్తుచేసేవాడు. చెల్లెలిని జాగ్రత్తగా చూసుకునేవాడు అని రేణు దేశాయ్ వెల్లడించింది.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!