Connect with us

Featured

మీ మూత్రం నురగ నురగ్గా ఉంటే ఈ వీడియో తప్పక చూడండి

Published

on

మూత్రం కూడా శరీర ఆరోగ్యానికి ఓ సూచిక అని ఆరోగ్య స్పృహ కలిగిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు అనేక వ్యాధులను మూత్ర పరీక్ష ద్వారానే గుర్తిస్తారన్న సంగతి తెలిసిందే. మూత్రం పోసినప్పుడు స్పష్టంగా ఉంటే ఓకే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ మూత్రం ముదురు రంగులో, దుర్వాసనతో, బుడగలతో, నురగతో ఉంటే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టు సంకేతం.

బిజీలో ఉన్నప్పుడు, పని ఒత్తిడితో ఎక్కువ ఫోర్స్ తో మూత్రం పోసినపుడు బుడగలు కూడా రావొచ్చు. అలాగూ యూరినల్స్ ని కెమికల్స్ తో కడిగిన వెంటనే మూత్రానికి వెళ్లిన వారికి బుడగలు, నురగ కనిపించొచ్చు. అటువంటివి పట్టించుకోవాల్సిన పనిలేదు. కాని ఏయే సందర్భాల్లో మూత్రం నురగ రాకూడదో, వస్తే ఎటువంటి సమస్య ఉన్నట్లో కింద చూద్దాం..

Advertisement

మానసిక ఒత్తిడి డిప్రెషన్ లో ఉన్నవారికి మూత్రంలో నురుగ వస్తుంది. ఇలా డిహైడ్రేషన్ వల్ల కూడా రావొచ్చు. మీకు డిహైడ్రేషన్ అయితే, మీ మూత్రంలో ప్రోటీన్స్, కొన్ని రసాయనాలు అధిక స్థాయిలో పెరుగుతాయి. డీహైడ్రేషన్ నివారించుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి.

గర్భధారణ సమయంలో నురుగుతో కూడిన మూత్రం రావడం సాధారణం. గర్భం కారణంగా ఊపిరితిత్తుల మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతొ ప్రోటీన్ మూత్రంలోకి వెళ్ళడానికి నురగ కారణం కావొచ్చు.
ఆదుర్దాగా లేదా ఒత్తిడిగా ఉన్నపుడు మూత్రం నురగగా లేదా బుడగలుగా మారుతుంది. యూరిన్ లో ఉంటే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు.

మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది. షుగర్ వ్యాధి మూత్రపిండాలపై ప్రభావం చూపించి మూత్రం నురగగా వస్తుంది. అధిక బ్లడ్ షుగర్ స్థాయి మూత్రపిండాలకు చెడు చేస్తుంది.
మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటే, ఆ స్ధితిని ప్రోటీన్యూరియా అంటారు. మూత్రపిండాలు ప్రోటీన్ ని సరిగా ఫిల్టర్ చేయలేకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Advertisement

మూత్రనాళాలు బాక్టీరియా బారిన పడినపుడు, నురగతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉంది.
మూత్రంలో నురుగుకు గుండె సమస్యల లక్షణాలు కావొచ్చు. మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నపుడు గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మూత్రంలో నురగ కంటిన్యూగా వస్తే వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిది.

మన శరీరం రకరకాల ప్రతిస్పందనల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటుంది. అలాంటి సూచనల్లో మూత్రం రంగు కూడా ఒకటి. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మూత్రం రంగు మారుతుంది. మారిన మూత్రం రంగు ఎలాంటి అనారోగ్యానికి కారణమో అవగాహన కలిగి ఉండడం అవసరం.

ఎరుపు మూత్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం మూత్రంలో రక్తం కలిసి విసర్జితమవడం. ఇది చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అవుతుంది. లేదా కిడ్నీ లేదా బ్లాడర్‌లో రాళ్లు ఉండడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ గాయపడడం లేదా ప్రొస్టేట్ సంబంధిత సమస్యలేమైనా కావచ్చు. చాలా అరుదుగా బ్లాడర్ లేదా కిడ్నీలో క్యాన్సర్ కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు కానీ దీన్ని సమస్యకు ఒక సూచనగా భావించవచ్చు.

Advertisement

నీలం మూత్రం నీలం రంగులో పసి పిల్లల్లో కనిపించే సమస్య. నవజాత శిశువుల్లో రక్తంలో ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల వారి మూత్ర విసర్జన నీలం రంగులో ఉంటుంది. దీనిని బ్లూ డైపర్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జన్యులోపం కారణంగా వచ్చే సమస్య. పెద్ద వారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.

నలుపు కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల మూత్రం నలుపు రంగులో ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒక్కోసారి ఐరన్ లోపం సరిచేసేందుకు వాడే ఇంజక్షన్ల కారణంగా కూడా మూత్రం నలుపు రంగులో రావచ్చు.

జేగురు ఇది సాధారణంగా చర్మం లేదా గొంతులో ఇన్‌ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడినపుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి స్థితి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా దీన్ని నుంచి బయటపడవచ్చు. కానీ చాలా మంది డాక్టర్లు తర్వాత కాలంలో రాబోయే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కు ఇది ఒక సూచనగా భావిస్తారు.

Advertisement

ముదురు పసుపు మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. డీహైడ్రేషన్‌కు లోనైనపుడు అది ముదురు రంగులోకి మారుతుంది. ఒక్కోసారి లివర్ సమస్యలు, కామెర్ల వంటి సమస్యలున్నపుడు కూడా మూత్రం ముదురు పసుపు రంగులో రావచ్చు. కొన్ని రకాల మందులు వాడుతున్నపుడు కూడా మూత్రం పసుపు రంగులో వచ్చే ఆస్కారం ఉంటుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!