Connect with us

Featured

రామ్ చరణ్ కంటే భారీగా కియారా అద్వానీ రెమ్యునరేషన్.. దిల్ రాజు అన్ని కోట్లు ఇస్తున్నాడా?

Published

on

ఒక సినిమా హిట్ అయ్యేంత వరకే హీరోయిన్స్ కాస్త నిదానంగా ఉంటారు. హిందీలో గానీ, తెలుగులో గానీ, తమిళంలో గానీ ఓ భారీ హిట్ పడిందా..ఇక నిర్మాతలకి చుక్కలే కనిపిస్తాయి. మొదటి సినిమాకి రెమ్యునరేషన్ ఎంత కావాలి అంటే మీరెంతిచ్చినా పర్లేదు సార్. నాకు మీ సినిమాలో అవకశామ రావడమే ముఖ్యం అని చిలక పలుకులు పలుకుతారు. డెబ్యూ సినిమా హిట్ అయితే మాత్రం అదే నిర్మాత మరో సినిమా చేయమంటే నాకు ఇప్పటికే ఆ నిర్మాతలు అంతిస్తామంటున్నారు..హిందీలో ఆఫర్ వచ్చింది. డేట్స్ చూడాలి అని నిచ్చెన ఎక్కడం మొదలు పెడతారు. ఎప్పుడు ఏ హీరోయిన్ కెరీర్ అర్థాంతరంగా రెండు ఫ్లాపులతో క్లోజ్ అవుతుందో తెలీదు. అందుకే ముందుగానే జాగ్రత్త పడుతుంటారు. ఇప్పుడు కియారా అద్వానీ కూడా అదే చేస్తోందట.

కియారా అద్వానీ 2016 లో వచ్చిన ఎంఎస్ ధోని సినిమాతో హీరోయిన్ గా  బాగా పాపులర్ అయింది. ఈ సినిమాకి ముందు కియారా అవకాశాల కోసం చాలానే స్టగుల్ అయ్యింది. అయితే ధోనీ సినిమా తన ఫేట్ మార్చేసింది. హిందీలో చేసిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తెలుగు లో మహేష్ బాబుతో నటించిన మొదటి సినిమా భరత్ అనే నేను విపరీతమైన పాపులారిటీని తీసుకు వచ్చాయి. భరత్ అనే నేను సినిమా కు కియారా రెమ్యునరేషన్ 75 లక్షల వరకు తీసుకుంది.

అయితే ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో చేసిన కబీర్ సింగ్ సినిమాతో వరుస సినిమాలు కమిటయి బిజీగా అయింది. అయితే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించేందుకు కియారాకు కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు అని అప్పట్లో టాక్ వచ్చింది. దీని తర్వాత మళ్ళీ తెలుగులో నటించేంత సమయం దొరకలేదు. బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతోనే గడుపుతోంది. దాంతో అక్కడ ఈమె రెమ్యునరేషన్ కూడా 2 నుంచి 3 కోట్లకి చేరింది. ఆ మధ్య ఓ తెలుగు సినిమాకి సంప్రదిస్తే కూడా చుక్కలు లెక్కపెట్టుకునే రెమ్యునరేషన్ చెప్పిందట.

అయితే ఇప్పుడు క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాన్ ఇండియన్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు. రీసెంట్ గా చరణ్ – శంకర్ సినిమాలో కియారా నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇస్తూ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కాగా ఈ సినిమాలో నటిస్తున్నందుకు శంకర్ – దిల్ రాజు కియారాకు దాదాపుగా రూ. 5 కోట్లను రెమ్యునరేషన్ గా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

చరణ్ కెరీర్ లో 15వ సినిమా. అలాగే దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి 50 వ సినిమా. ఇలా అటు చరణ్ ఇటు దిల్ రాజుకి మైల్ స్టోన్ మూవీ కాబట్టి బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇక చరణ్ కి బాలీవుడ్ మార్కెట్ మీద మంచి పట్టుంది. శంకర్ సినిమాతో దాన్నీ బాగా పెంచుకోవాలనుకుంటున్నాడు. సౌత్ లోని అన్నీ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది. అందుకే కియారా అద్వానీని తీసుకున్నారు. తను కూడా ఈ ప్రాజెక్ట్ కి ఉన్న వెయిట్ చూసే రూ. 5 కోట్లను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!