డిజిటలైజేషన్ నేపధ్యంలో సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమలో సైబర్ నేరాలు బారీగా పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో ఎవరూ ఊహించని రీతిలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. ఇక ఒకవైపు కరోనా మహామ్మరితో ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. కొందరు అడ్డదారులు వెతుకుతూ దొరికిన వారిదగ్గర దొరికినత మోసం చేస్తూ దోచుకుంటున్నారు.

ఈ క్రమంలో కేవలం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రమే గడిచిన రెండు రోజులుగా సుమారు రూ.51 లక్షల మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. ఇంతేజార్గంజ్, సుబేదారి, హన్మకొండ పోలీస్స్టేషన్లలో ఈ తరహా కేసులు నమోదు భారీగా నమోదయ్యాయి. అయితే వీటిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఇటువంటి సైబర్ మోసగాళ్ళ చేసే మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.































