Connect with us

General News

వరకట్నం కేసును బిర్యానీ కేసుగా మార్చేశారు..హ్యాట్సాఫ్ మీడియా..

Published

on

వరకట్నం కేసును బిర్యానీ కేసుగా మార్చేశారు..హ్యాట్సాఫ్ మీడియా..

మానస కి రాజేంద్ర ప్రసాద్ కి గతేడాది నవంబర్ లోనే పెళ్లయింది. అత్తవారింటి పోరు వల్ల గత కొద్ది రోజులుగా భర్తకు ఆమెకు పొసగడంలేదు. ఎప్పుడు చూసిన అదనపు కట్నం తెమ్మని వేధించే వాళ్ళు. అంతేకాక ఒకానొక రోజు కట్నం తెస్తేనే ఇంటికి రమ్మని ఆమెను ఇంటి నుండి గెంటేశారు. మానస వెళ్లి పోలీసులని ఆశ్రయించిన లాభం లేకుండా పోయింది. పోలీసులు స్పందించక పోవడంతో ఆమె తన తరుపు వాళ్ళతో భర్త ఇంటి ముందు దీక్షకి దిగింది. దీంతో స్పందించిన పోలీసులు దీక్ష విరమించుకోవాలని కోరారు. కానీ మానస తన భర్త తనని ఇంట్లోకి అనుమతిస్తేనే దీక్ష విరమిస్తానని తెగెసి చెప్పేసింది. అసలు జరిగిన ఘటన ఇది కానీ మన మీడియా వారు మాత్రం దీనిని ఎలా వక్రీకరించారో ఒక్కసారి చుడండి.

* అయనకు భార్య కంటే బిర్యానీయే ఎక్కువ

* బిర్యానీ కోసం పెళ్లాన్నే వదులుకున్న మొగుడు

Advertisement

* తనకు బిర్యానీ వండి పెట్టలేదని, ఏకంగా భార్యను గెంటేసిన భర్త

ఇలాంటి టైటిల్స్ పెట్టి, మన మీడియా వారందరూ స్టోరీల మీద స్టోరీలు రాసేశారు. అతను చేసిన నేరం కట్నం అడగడం. కానీ అది మర్చిపోయి బిర్యానీ అసలు పాయింట్ గా మారింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా చెప్పండి..? వాస్తవంగా ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో బిర్యానీ కూడా ఉంది. కానీ భర్త రోజు మందు.బిర్యానీ కావాలని డిమాండ్ చేసేవాడు. అది అసలు ఇష్యూ కాదు. సదరు మహిళను హింసించాలనే ఉద్దేశంతో, అదనపు కట్నం కోసం భర్త చేసిన పనుల్లో ఇది కూడా ఒకటి. కానీ సగం సగం తెలుసుకున్న మన తెలుగు మీడియా జనాలు, తమకి ఇష్టం వచ్చినట్టు స్టోరీలు రాసి పడేసారు. ఎంతలా అంటే, నేషనల్ మీడియా కూడా ఇదే బిర్యానీ పాయింట్ పై స్టోరీలు ప్రసారం చేసింది అంతలా..

తర్వాత కానీ పోలీసులు అసలు విషయం ఏంటి అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. “మొదటినుంచీ వారిద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు. మా స్టేషన్ తో పాటు చాలా స్టేషన్లకు ఇరువైపులా బంధువర్గాలు తిరిగారు. కానీ వారిద్దరి మధ్య సమస్య ఇంకా మారలేదు. కానీ లోకల్ గా కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం కారణంగా మన న్యూస్ ఛానెల్స్ తో పాటు నేషనల్ న్యూస్ ఛానెల్స్ కూడా బిర్యానీ పాంయింట్ ని ప్రముఖంగా ప్రచురించాయి. ఈ విషయం దేశం మొత్తం పాకిపోవడంతో, నా పై అధికారులు నాకు ఫోన్లు చేసి అసలు ఈ బిర్యానీ గొడవేంటి అని అడుగుతున్నారు. దాంతో అసలు కేసు అది కాదని, వరకట్నం కేసు అని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పాల్సి వచ్చింది” అంటున్నాడు వరంగల్ లోని వర్ధన్నపేట ఎస్సై.

Advertisement

ఇప్పుడయితే ఆ ప్రబుద్ధుడిపై వరకట్న చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!