వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్, నిత్యం ఎవరినో ఒకరిని బూతులు తిడుతూ వార్తల్లో ఉండే నటి శ్రీరెడ్డి. ఈ మధ్య సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా ఫెస్ బుక్ లో తరచూ పోస్ట్ లు పెడుతూ టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయనాయకులపై సెటైర్ లు కూడా వేస్తుంది. టాలీవుడ్ లో వివాదాలతో మకాం చెన్నై కి మార్చింది.
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖలు చేస్తూ బూతుల దండకం అందుకునే శ్రీరెడ్డి, హఠాత్తుగా పశ్చాత్తాప పడుతోంది. నమ్మలేక పోతున్నారు కదా ?? నిజమేనండి అసలు విషయమేంటంటే గతంలో నటి రాధికా శరత్ కుమార్ పై ఘాటు వ్యాఖలే చేసింది. అయితే ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతుంది. “రాధికా శరత్ కుమార్ గారు.. చాలా కారణాలకి మీకు శెభాష్.. ఇప్పుడు నాతల మీ పాదాల దగ్గర పెడుతున్నా..” అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి లో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పుకి కారణం ఏంటో అర్ధంకాకా నెటిజన్లు జుట్టుపీక్కుంటున్నారు. ఇంతకీ ఈ మార్పుకి కారణం ఏమైయుంటుందో…
































