Connect with us

Featured

విడాకులు మంజూరు కాగానే కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయిన సీనియర్ హీరోయిన్ సరిత..

Published

on

సరిత ఈపేరు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. ఒకప్పటి దక్షిణాది హీరోయిన్. ఎంతో అద్భుతమైన నటనతో ఎందరో ప్రేక్షకుల గుండెల్లో కొలువయింది సరిత. అంతేకాదు సరిత గాత్రం వింటే ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఎంతోమంది హీరోయిన్స్ కి తన గాత్రాన్ని అరువుగా ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అయితే సరిత చూడడానికి నల్లగా ఉన్నా ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో విరిసిన ఒక నల్ల కలువ అని అప్పట్లో సరితను పిలిచేవారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది సరిత. అంతేకాకుండా ఎందరో తెలుగు, తమిళ హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెప్పింది. అన్ని భాషల్లో కలుపుకుని మొత్తం 150 సినిమాలు దాక చేసింది. అన్ని భాషల్లో కలుపుకుని 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు అనేక అవార్డ్స్ అందుకుంది.

అలాగే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘అర్జున్’ అనే సినిమాలో అండాలు అనే నెగటివ్ పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమాకు గాను సరితకు నంది స్పెషల్ డ్యూరి అవార్డు అందుకుంది. గుంటూరులో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి బాల చందర్ తీసిన మరో చరిత్ర సినిమా ద్వారా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అప్పట్లో సరిత సంచలనం సృషించింది. లెక్కకు మించి సినిమాల్లో నటించిన గాని, ఎన్ని అవార్డులు అందుకున్నా గాని సరిత వైవాహిక జీవితం మాత్రం ఎన్నో ఒడి దుడుగులతో ముందుకు సాగింది. సరిత రెండు సార్లు పెళ్లి చేసుకుంది. 1975 లో తెలుగు రంగస్థల నటుడు వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్ళైన మరుసటి సంవత్సరమే అంటే 1976 లో భర్తతో విడిపోయింది.

ఆ తరువాత 1988 లో మలయాళ నటుడు ముఖేష్ ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు శ్రవణ్, తేజ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నాళ్ళకు వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. తర్వాత విడాకులు కోరుతూ ముఖేష్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007 లో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. ఆ తరువాత ముఖేష్ క్లాసికల్ డాన్సర్ అయిన మిథిల్ దేవికను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహం చెల్లదని సరిత కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉన్నపుడు తాను దుబాయ్ లో ఉన్నానని, కోర్టు పంపిన నోటీసులు తాను అందుకోలేదని తెలిపారు. ఫలితంగా కోర్టుకు హాజరు కాలేకపోయాను. అలా కోర్టు విడాకులు మంజూరు చేసిందని తేలిపారు. ముఖేష్ రెండవ వివాహం చెల్లదని కోర్టు తిరిగి తీర్పును ఇవ్వాలని న్యాయస్థానం ని కోరారు. అప్పుడు విచారణ కోసం కోర్టుకు హాజరు అయిన సరిత కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయారు. కోర్టుకి ముఖేష్ కూడా హాజరు అయ్యారు. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. సరిత మాత్రం తన ఇద్దరి కొడుకులతో దుబాయ్ లోనే ఉంటుంది. ముఖేష్ మాత్రం తన కొత్త ఫ్యామిలీతో ఏర్నాకులంలో ఉంటున్నాడు.

అయితే ముఖేష్ తో మనస్పర్థలు రావడానికి గురించి తెలుసుకుంటే.. సరితకు ముఖేష్ తో పెళ్లి అయిన తరువాత కూడా పద్ధతిగా ఉండే మంచి పాత్రలు చేయడానికి కూడా అంగీకరించలేదు. ఈ కారణంగానే ఎన్నో మంచి సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయానని పలు సందర్భాల్లో తెలిపింది సరిత. అలాగే నా పట్ల ముఖేష్ అనుచితంగా ప్రవర్తించేవాడు. అలాగే శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. అతని బాధ్యత రాహిత్యం, మద్యానికి బానిస అవ్వడం ఇవన్నీ పిల్లలపై ప్రభావం చూపాయని, అందుకే ముఖేష్ నుండి విడిపోవాలని అనుకున్నాను అని తెలిపారు. అలాగే సరిత మన తెలుగు హీరోయిన్స్ కు చాలా మందికి డబ్బింగ్ చెప్పింది. టబూ, నగ్మా, సుస్మితాసేన్, విజయశాంతి, రమ్య, రాధిక, సుహాసిని లాంటి టాప్ హీరోలకు డబ్బింగ్ చెప్పింది. అంతేకాదు మా ఆయన బంగారం, అంతఃపురం వంటి సినిమాల్లో సౌందర్యకి డబ్బింగ్ చెప్పి బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా వచ్చింది. ఇన్ని ఒడిదుడుకులతో సరిత జీవితం ముందుకు సాగింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!