కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలల విద్యార్థులకు ఈ సారి కూడా ఆన్లైన్ ద్వారానే పాఠ్యాంశ బోధన జరుగుతుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా ఆన్లైన్ బోధన కొనసాగిస్తామని ఆమె అన్నారు.

సెట్ ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని, విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం జులైలో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు.
































