హోలీ పేరుతో కొందరు యువకులు వీర్యంతో నింపిన బెలూన్లను అమ్మాయిలపైకి విసిరేశారు.దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. ఈ మేరకు లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం ఢిల్లీని కుదిపేస్తోంది. పలువురు విద్యార్థినీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విమెన్ రైట్స్ గ్రూప్ ఆందోళన నిర్వహించింది.

హోలీ పేరుతో కొన్ని చోట్ల కొంత మంది దుండగులు యువతులపైకి నీటితో నింపిన బెలూన్లను కూడా వదిలారు.కాలేజీ ప్రాంగణంలో కొందరు ఏదో ద్రవ పదార్థంతో నింపిన బెలూన్ను తనపై విసిరేశారని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని తన మిత్రురాలికి చెప్పింది. ఆమె దుస్తులపై పడిన పదార్థాన్ని పరీక్షగా గమనించగా.. అది వీర్యమని తేలింది. దీంతో వెంటనే వారు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.



























