Connect with us

Featured

సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను నేర్చుకున్నది ఏం లేదు.. పోసాని షాకింగ్ కామెంట్స్?

Published

on

పోసాని కృష్ణమురళి.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక నటుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. డైరెక్టర్ గా.. ఇలా సినిమా ఇండస్ట్రీలో అన్నింట్లోనూ ఆరితేరిన వ్యక్తి. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ అయినా.. తండ్రి క్యారెక్టర్ అయినా.. కమెడియన్ గా అయినా.. అది ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే.. పోసానికి వెన్నతో పెట్టిన విద్య. ఇట్టే అవలీలగా నటించేస్తారు పోసాని. అందకే.. పోసాని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయిపోయారు.

అయితే.. పోసాని కృష్ణమురళి.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పెద్దగా నేర్చుకున్నది ఏం లేదట. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలో చదువుతున్న సమయంలోనే యాక్టింగ్ చేసేవారట. అప్పుడు యాక్టింగ్ లో ఎన్నో అవార్డులు వచ్చాయట. స్కూల్ డేస్ ను నేను బెస్ట్ కమెడియన్ ను. నాగార్జున యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్ ను. మద్రాస్ యూనివర్సిటీలోనూ మంచి యాక్టర్ ను. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలోనే నాకు చాలా అవార్డులు వచ్చాయి.. అని పోసాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరా

మద్రాస్ లో ఎంఫిల్ చేస్తున్న సమయంలో.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర పార్ట్ టైమ్ రైటర్ గా జాయిన్ అయ్యారు పోసాని. ఆ పార్ట్ టైమ్ కాస్త ప్రస్తుతం లైఫ్ లోనే పార్ట్ అయిపోయింది అని పోసాని తెలిపారు. ఏదో పాకెట్ మనీ కోసం రైటర్ గా మారితే.. ఇప్పుడు అదే వృత్తి అయిపోయింది. అసలు రైటర్ అవ్వాలన్న ఆలోచనే తనకు లేదట. వాళ్ల ఫ్యామిలీలో ఎక్కువ చదువుకున్నది పోసాని మాత్రమే. అందుకే.. తాను ఏనాడూ రచయిత కావాలని ఆలోచించలేదు కానీ.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరారు పోసాని.

పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలనుకున్నా

నిజానికి పోసాని కృష్ణమురళి యాక్టర్ కావాలని కానీ.. సినిమా ఇండస్ట్రీలోకి కానీ రావాలని ఏనాడూ అనుకోలేదట. ఆయనకు చదువుకుంటున్న రోజుల్లో పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలని అనుకున్నారట. కానీ.. అనుకోకుండా.. రచయితగా మారడం.. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. దీంతో సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది పోసానికి. మనం ఏం అవ్వాలో లైఫే డిసైడ్ చేస్తుంది. మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. నా రైటింగ్ స్కిల్స్ పరుచూరి బ్రదర్స్ కు నచ్చడంతో నాకు అవకాశం ఎక్కువ ఇచ్చారు.. అని పరుచూరి చెప్పారు.

ఒక సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను పరుచూరి గోపాలకృష్ణ మూడు రోజుల్లో రాసేస్తారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా స్క్రిప్ట్ ను అత్యంత వేగంగా రాసే రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటూ పోసాని చెప్పుకొచ్చారు. ఒక సినిమా స్క్రిప్ట్ ను పూర్తిగా అన్ని డైలాగ్స్ తో కలిపి కేవలం 3 రోజుల్లో రాసేస్తారట ఆయన. ఆయన అంత ఫాస్ట్ గా ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాసేవాళ్లు లేరని పోసాని అన్నారు. కాకపోతే.. నేను కూడా రెండు రోజుల్లోనే రాసేవాడిని కానీ.. పరుచూరి అంత పర్ ఫెక్ట్ గా రాసేవాడిని కాదు.. అంటూ పోసాని కృష్ణమురళి చెప్పారు. 

Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!