Connect with us

Featured

సూపర్ స్టార్ ఫ్యామిలీలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్ కానిది ఆయనొక్కడే !!

Published

on

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో నటులు, నిర్మాతలు ఉన్నారు. కృష్ణ.. తేనే మనసులు సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంబించారు. దాదాపు 350 పై చిలుకు చిత్రాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అగ్ర నటుడుగా, నిర్మాతగా ఊహించని క్రేజ్ సంపాదించుకున్నారు. విజయ నిర్మలను రెండవ వివాహం చేసుకున్న కృష్ణ ఆమె దర్శకత్వంలో కూడా హీరోగా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ నిర్మాణ సంస్థను స్థాపించి బ్లాక్ బస్టర్స్ నిర్మించారు. ఈ సినిమాలలో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్ సాధించినవే. నిర్మాణ రంగంలోనే కాదు సొంత స్టూడియోను స్థాపించి సినిమాలు తీశారు.

ఇలా కృష్ణ హీరోగా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన వారసులు ఇండస్ట్రీలోకి వచ్చారు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల నటులుగా, నిర్మాతలుగా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తూ, నటిస్తూ ఉన్నారు. కృష్ణ కూమార్తె మంజుల 1999లో ‘రాజస్థాన్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ‘సమ్మర్ ఇన్ బెత్లెహెం’ అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇక 2002 లో ‘షో’ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన గుర్తింపు సాధించారు.

అంతేకాదు ‘షో’ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకొని, జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు అందుకున్నారు. మంజుల తన సొంత ప్రొడక్షన్ హౌజ్ అయిన ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘నాని’, ‘పోకిరి’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఏ మాయ చేశావే’, ‘మనసుకు నచ్చింది’ లాంటి సినిమాలు చేశారు. వీటిలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ 75 ఏళ్ళ తెలుగు సినిమా పరిశ్రమలోని రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మంజుల సోదరుడు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు. మంచి కథ దొరికే మంజుల ఇప్పటికీ సినిమాలు నిర్మించడానికి రెడీగా ఉన్నారు.

ఇక ఈ ఫ్యామిలీలో మరో వారసుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు. నటుడుగా, నిర్మాతగా సినిమాలు చేశాడు. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో అంతగా సక్సెస్ కాలేదంటే అది రమేష్ ఒక్కడే. మనషులు చేసిన దొంగలు, పాలు నీళ్ళు, నీడ వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రమేష్, సామ్రాట్ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు వంటి సినిమాలలో నటించాడు. కానీ హీరోగా స్టార్ డం దక్కలేదు. ఆ తర్వాత సొంతగా కృష్ణ ప్రొడక్షన్స్ స్థాపించారు.

ఈ నిర్మాణ సంస్థలో హిందీ ‘సూర్యవంశం’ నిర్మించారు. ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తమ్ముడు మహేష్ బాబు హీరోగా ‘అర్జున్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అద్బుతంగా ఉందనే ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా మాత్రం నిరాశపరచింది. దీని తర్వాత మహేష్ హీరోగా యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అథిది’ సినిమాను నిర్మించి దెబ్బతిన్నాడు. చివరిగా రమేష్ బాబు సమర్పణలో ‘దూకుడు’ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ సాధిచింది. ఈ సినిమా తర్వాత రమేష్ బాబు నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే రమేష్ బాబు ప్రస్తుతం సూపర్ స్టార్ సొంత నిర్మాణ సంస్థలకి, ఇతర వ్యాపారాలకి సంబంధించిన పనులు చూసుకుంటున్నాడట.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!