ఒకప్పటి సౌత్ స్ర్కీన్ మీద ఆమె అందాల రాశి. మతిపోగొట్టే అందం ఆమె సొంతం. చక్రాల్లాంటి కళ్ళతో ఆకర్షణీయమైన ముఖంతో అప్పటి ప్రేక్షకుల హార్ట్ బీట్ వేగాన్ని పెంచేది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా శృంగార భరితమైన పాత్రలు పోషించేది.
Advertisement
తెలుగు లో పంతులమ్మ, అమెరికా అమ్మాయి, దశతిరిగింది, కొత్తనీరు,అక్బర్ సలీం అనార్కలి, లేడీస్ టైలర్, డబ్బెవరికి చేదు, స్వాతి ముత్యం, లాంటి చిత్రాలతో బాగా పాప్యులారిటీ తెచ్చుకుంది. స్వతహాగా ఆమె మలయాళీ. మలయాళ తెరమీద ఆమె ఉన్నీ మేరి గా కొన్ని దశాబ్దాల కాలం పాటు అలరించింది. అప్పటి మాలీవుడ్ సూపర్ స్టార్స్ అందిరితోనూ తెరమీద తన అందంతో , అభినయంతో ఆకట్టుకొనేది.
1962 లో కేరళలోని ఎర్నాకుళం లో అగస్టిన్ ఫెర్నాండెజ్ , విక్టోరియా దంపతులకు జన్మించింది. అక్కడే సెయింట్ థెరిసా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. మూడేళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె తల్లి ప్రొఫెషనల్ బ్యాలే ట్రూప్ ను రన్ చేస్తూ ఉండేది.
1969 లో నవవధు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ఉన్ని మేరీ అంటే ఒక హాట్ బ్రాండ్. అప్పటి ఆమె సినిమాలు మాలీవుడ్ యూత్ ను బాగా ఎట్రాక్టివ్ చేసేవి. మలయాళ, తమిళ్, తెలుగు , కన్నడ భాషల్లో లెక్కకుమించిన చిత్రాల్లో నటించింది. 1982లో రిజాయ్ అనే కాలేజ్ ప్రొఫెసర్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు నిర్మల్ అనే ఒక కొడుకు. రిహాన్ అనే మనవడు.
Advertisement
1992 లో వచ్చిన ఎన్నోడిష్టం కూడామో అనే సినిమా ఆమె చివరిది. నైంటీస్ లోకి అడుగుపెట్టేసరికే దీప బాగా లావు అయిపోయింది. భారీ శరీరంతో ఆమె సినిమాల్లో చాలా ఇబ్బందిగా నటించేది. ఆ శరీరంతోనే ఆమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సినీ రంగానికి గుడ్ బై చెప్పేసింది. స్వతహాగా ఆమె క్రిష్టియన్ కావడంతో, సినిమా రంగాన్ని వదిలేసిన నాటినుంచి స్పిరిట్యువల్ వే లో ట్రావెల్ చేస్తోంది.
చాలక్కుడి లోని పొట్ట అనే గ్రామంలో స్పిరిట్యువల్ క్యాంప్ నిర్వహిస్తూ, ఎవాంగ్లిష్ట్ గా మారిపోయింది. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.
ఇప్పుడు దీప.. అప్పటి భారీ శరీరాన్ని కొంత వదిలించుకొని కాస్త నాజూగ్గా తయారైంది. తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా అని అడిగితే, నేను సినిమాలు చూసి చాలా కాలమైపోయింది. ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని రావాలంటే కొంచెం కష్టమే..
Advertisement
దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నాజీవితాన్నిఇలాగే ఆనందంగా గడిపేస్తానని అంటోంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
Pawan Kalyan: ఇటీవల నటుడు మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వీడియో పట్ల వైసిపి ప్రధానం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి కూటమికి మద్దతు తెలపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఇలా పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు తెలుపుతున్నారనే విషయం గ్రహించే అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కూటమికి మరింత బలం చేకూరుతుందని చెప్పాలి. ఇలాంటి తరుణంలోనే సజ్జల చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలా చిరంజీవి పట్ల సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు.
Advertisement
డబ్బు అధికారం ఎక్కువయ్యాయి.. రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసిపి సింహం కాదని గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మేమంతా కూటమిగా ఏర్పడినది స్వలాభం కోసం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా ఏర్పడ్డామంటే ఈ సందర్భంగా వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Suriya: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సూర్య జ్యోతిక ఇద్దరు కూడా కెరియర్ పరంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక సూర్య దంపతులు కెరియర్ పరంగా బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. సూర్య దంపతులకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే తాజాగా తన కుమారుడు దేవ్ సాధించిన ఘనత పట్ల సూర్య ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తన కుమారుడు దేవ్ కరాటే నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ సాధించారు. అయితే ఈ బ్లాక్ బెల్ట్ అందించే కార్యక్రమానికి హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కుమారుడు సాధించిన ఘనత చూసి ఈయన పుత్రోత్సాహంతో ఉన్నారు.
Advertisement
బ్లాక్ బెల్ట్.. తన కొడుకు వేదిక పైకి రాగానే తనకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన కొడుకు వేదిక దిగి వెళుతుండగా సూర్య మాత్రం సంతోషంతో తదేకంగా తన కొడుకు వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో తన కొడుకు సాధించిన ఘనత పట్ల సూర్య ఓ తండ్రిగా సంతోషం వ్యక్తం చేయడంతో ఆ సంతోషం తన కళ్ళల్లో కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.