ఈ కాలం యువత పబ్ జి కి ఎలా అడిక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పబ్ జి ఆటకు బానిసై పోయారు. గంటల తరబడి పబ్ జి ఆటలో మునిగిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఇండియాలో పబ్ జి బ్యాన్ అవ్వడం వల్ల కాస్త యువత కోలుకుంటుంది కానీ గతంలో ఈ ఆటకు బానిసై, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పబ్ జి ఆడడానికి తల్లితండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ లకు బానిసై ఎంతో మంది తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. అయితే పబ్ జి ఆట వల్ల ఇప్పుడు మరో షాకింగ్ ఘటన జరిగింది.

తమిళనాడుకు చెందిన బాబిష అనే 20 ఏళ్ల యువతి లాక్ డౌన్ కారణంగా ఇంట్లో బోర్ కొడుతుండడంతో పబ్ జి ఆట ఆడటం మొదలు పెట్టింది. ఆన్లైన్ లో ఆట ఆడుతున్న సమయంలో ఆమెకు అజిత్ ప్రిన్స్ అనే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ గంటలకొద్దీ మాట్లాడుతూ ఇంకా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు.
ఈ విషయం ఇంట్లో తెలిస్తే సమస్యగా మారుతుందని బాబిష, అజిత్ ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో బాబిష తల్లిదండ్రులు తిరువత్తర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వారి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటికే వారిద్దరి వివాహం జరిగిపోయింది. అయితే బాబిష అజిత్ దగ్గర ఉండడానికే ఇష్టపడటంతో తల్లితండ్రుల వద్దకు ఆమె వెళ్ళమని చెప్పిన వెళ్ళలేదు. ప్రస్తుతం పబ్ జి ప్రేమ కథ నెట్టింట వైరల్ గా మారింది.



























