21 ఏళ్ల యువకుడితో నాలుగో పెళ్ళికి సిద్దమైంది ఉత్తర్ప్రదేశ్ కు చెందిన ఓక మహిళ.. ప్రియుడితో సహాజీవనానికి అడ్దోస్తున్నారని తన నలుగురు కుమార్తెలను ఇంట్లో నుంచి గెంటేసింది.. ఆపై ఆ యువకుడితో నాలుగో వివాహానికి సిద్దమైంది. ఉత్తర్ప్రదేశ్లోని భిండ్ జిల్లా, ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. మిథున్ అనే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అయితే గత కొద్దికాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఇక ప్రస్తుతం ఆ యువకుడితో నాలుగో వివాహానికి సిద్ధమైంది. ఇక తన వివాహానికి అడ్డు చెబుతున్నారనే నెపంతో తన నలుగురు కుమార్తెలను బయటకు పంపేసింది. దీనితో తమపై తల్లి వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదంటూ ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను, ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.



























