దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మరణాల రేటు కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆస్పత్రులలో ఆక్సిజన్ అందక, బెడ్స్ దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు.

గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,980 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410 కి చేరింది. మ్మరోవైపు మరణాల సంఖ్య 2,30,168 కి పెరిగింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.






























