ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజవొమ్మంగి మండలం లాగరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లితో పాటూ 4 నెలల వయస్సు ఉన్న ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా సోకింది. సీతారాంపురం గ్రామానికి చెందిన ఒక మహిళ అనారోగ్యానికి గురవగా కోవిడ్ టెస్టు చేయించారు.

ఆమెకు కోవిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దేనితో ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా టెస్ట్ చేయగా ఇద్దరికీ కూడా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి నందినీ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే అక్కడ గ్రామంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో.. మెరుగైన వైద్యం కోసం వీరిని రంపచోడవరం కోవిడ్ ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించారు.































