Anchor Anasuya: బుల్లితెరపై జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి, ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. తన హావ భావాలతో, అందంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. దీంతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ, ఇప్పుడు నటి గానూ మారి తన టాలెంట్ను నిరూపించుకుంటుంది.

ఇటీవల పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన పుష్ప సినిమాలోనూ నెగెటివ్ రోల్లో కనిపించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకుంది. నెక్స్ట్ తీయబోయే పుష్ప పార్ట్ 2లోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఈ ఒక్క సినిమా అనసూయ కెరీర్ను ఎక్కడికో తీసుకెళ్లి ఆమెకు ఎనలేని డిమాండ్ను కూడా తీసుకొచ్చింది.

ఇక సినిమాల్లో అవకాశం వచ్చినా అనసూయ మాత్రం టీవీ షోలను కంటిన్యూ చేస్తుండడం విశేషం. ఎందుకంటే నటిగా కంటే ముందు నుంచీ అందరికీ సుపరిచితమైంది యాంకర్గానే. కాబట్టి ఎంతో పేరు తెచ్చిన యాంకర్ వృత్తిని ఈమె ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దానికి తోడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తన హాట్ పిక్స్తో అదరగొడుతూ భారీ క్రేజ్ను సొంతం చేసుకుంటోంది.ఆ ఫొటోలకు కూడా లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. అయితే కొన్ని సార్లు ఆమె డ్రెస్సింగ్పైనా నెగెటివ్గా కామెంట్స్ వచ్చినా, వాటికి ధీటుగా స్పందిస్తూ సమాధానిస్తోంది అనసూయ.
కూతురు కావాలనే కోరిక…
ఇక వివరాల్లోకి వెళితే టెలివిజన్ వచ్చే ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న అనసూయ, అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ ఆకట్టుకుంటుంది. తాజాగా తాను ఓ బాధను అనుభవిస్తున్నానంటూ కన్నీటి పర్యంతమైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించే షోలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్లో అనసూయ ఓ పాపను ఎత్తుకొని ముద్దాడుతూ , ప్రేమగా లాలించడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ సమయంలోనే అక్కడే ఉన్న యాంకర్ రష్మీ, అనసూయ ఎప్పటినుంచో కూతుర్ని కనాలని ఎదురు చూస్తున్నట్టు చెబుతుంది. దీంతో ఎమోషనల్ అయిన అనసూయ, తాను కచ్చితంగా కూతుర్ని కంటానని ఆశిస్తున్నట్టు చెప్పగానే, యాంకర్ ప్రదీప్ వచ్చి తథాస్తు అనడం కొసమెరుపు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అనసూయలోని కొత్త కోణం చూసిన ఆడియెన్స్ చలించిపోతున్నారు.































