రూపాయి ,కిరాతకుడు,రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో ఆయన నటించారు.కిరాతకుడు సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాత కూడా వ్యవహారించారు. రూపాయి సినిమాకు కూడా సహ నిర్మాతగా ఉన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి విరామం తీసుకుని తన స్వంత గ్రామమైన రాజుల పాలెంలోనే స్థిర నివాసం ఏర్పాచుకున్నారు. ఆ గ్రామానికి సర్పంచ్ గా కూడా పని చేశారు.

గత రెండేళ్ళుగా కరోనా,ఇతర అనారోగ్య కారణాలతో చాలా మంది ప్రముఖులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.తాజాగా మరో నటున్ని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.































