బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సినీ నటుడు శివారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సింధు దేశ గర్వకారణమని అభినందించారు. అనంతరం సింధును సత్కరించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను బహూకరించారు రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. శివారెడ్డి తమ ఇంటి రావడం పట్ల సింధు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తను చేసే మిమిక్రీ చాలా బాగుంటాయంటూ శివారెడ్డిని అభినందించారు.
2016 రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యో-2021 ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన విషయం అందరికి తెలిసిందే. వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ పతాకాలను గెలిచిన రెండో భారత ప్లేయర్గా, తొలి మహిళగా నిలిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…