తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సుమన్ తాజాగా విశాఖపట్నంలోని గాజువాకలో ఏర్పాటుచేసిన కరాటే ఛాంపియన్ షిప్ ఈ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమన్ మా ఎన్నికల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ జరగబోయే ఈ ఎన్నికలలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై సుమన్ మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేయడానికి ఎవరైనా అర్హులేనని తెలియజేశారు.
మా ఎన్నికలలో స్థానిక స్థానికేతర అంటూ ప్రాంతీయ విభేదాలు చూపడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఒక్కసారి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ అవకాశాలు వచ్చినా అక్కడ నటిస్తారని అప్పుడు లేని స్థానిక ప్రాంతీయత ఎన్నికలలో ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏక తాటిపై నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని, సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చాలామంది షుగర్ బీపీ వంటి సమస్యలతో బాధపడుతూ మందులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు వారిద్దరికి సినీపరిశ్రమ సహాయం చేయాలని, మా అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా సూచించారు.




























