Connect with us

Featured

Silk Smithas Death Mystery: సిల్క్ స్మిత మృతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అనురాధ.. ఆ రోజు ఏం జరిగిందంటే?

Silk Smithas Death Mystery: 1970 -80 లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా అందరిని ఎంతో సందడి చేసిన నటి అనురాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన

Published

on

Silk Smithas Death Mystery: 1970 -80 లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా అందరిని ఎంతో సందడి చేసిన నటి అనురాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటిగా కంటే ఎన్నో ఐటమ్ సాంగ్స్ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. అప్పట్లో ఒక్కో పాటకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకొని తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్లకు రప్పించేది.

ఈ విధంగా ఎన్నో ఐటమ్ సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన అనురాధ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీని ఏలారు. ఇకపోతే అనురాధకు పోటీగా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ చేస్తూ సిల్క్ స్మిత, డిస్కో శాంతి గట్టి పోటీ ఇచ్చే వారు.

Silk Smithas Death Mystery: సిల్క్ స్మిత మృతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అనురాధ.. ఆ రోజు ఏం జరిగిందంటే?
Silk Smithas Death Mystery: సిల్క్ స్మిత మృతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అనురాధ.. ఆ రోజు ఏం జరిగిందంటే?

తాజాగా అనురాధ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని నటి సిల్క్ స్మిత డెత్ మిస్టరీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిల్క్ స్మిత నాకు అంత క్లోస్ కాదు కానీ మంచి స్నేహితురాలు. ఆమె ఎప్పుడూ కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు చాలా రిసర్వ్ డ్ గా ఉండేది.అయితే తనని చూస్తే చాలా పొగరు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. కాని తను చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండేదని అనురాధ తెలియజేశారు.

సిల్క్ స్మిత ఎప్పుడు తనతో మాట్లాడిన తాను అదికొన్నా,ఇది కొన్నా అని చెబుతూ ఉండేది కానీ తనకు ఎప్పుడూ ఇలాంటి కష్టాలు ఉన్నాయి, ఇలా బాధలు పడుతున్న అనే విషయాలు ప్రస్తావించలేదు. ఈ విధంగా తన వ్యక్తిగత విషయాలు మాకు చెప్పలేదు కనుక మేము కూడా ఎక్కువగా తనని అడిగే వాళ్ళం కాదు. ఇకపోతే తను చనిపోయే రోజు రాత్రి ముందు నాకు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నారు అని అడిగారు.మా ఆయన బెంగళూరు నుంచి వస్తున్నాడని ఎదురు చూస్తున్నాను అని చెప్పాను.

Advertisement
Silk Smithas Death Mystery: సిల్క్ స్మిత మృతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అనురాధ.. ఆ రోజు ఏం జరిగిందంటే?
Silk Smithas Death Mystery: సిల్క్ స్మిత మృతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అనురాధ.. ఆ రోజు ఏం జరిగిందంటే?

అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు….

ఇప్పుడు ఒకసారి మా ఇంటికి రాగలవా అని నన్ను ప్రశ్నించింది. ఇప్పుడా? రేపు ఉదయం పాపను స్కూల్ దగ్గర దింపి రానా అని అడిగితే సరే అని ఫోన్ పెట్టేసారు. ఉదయం లేవగానే టీవీలో సిల్క్ స్మిత మరణ వార్తను చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాను.ఒక వేళ ఆ రోజు రాత్రి నేను కనుక వెళ్లి ఉంటే తన బాధ నాతో చెప్పుకొని తాను ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదేమో అని ఈ సందర్భంగా సిల్క్ స్మిత మృతి గురించి చెప్పారు. అయితే సిల్క్ స్మిత ఎందుకు చనిపోయిందనే విషయం తనకు తెలియదని ఈ సందర్భంగా అనురాధ సిల్క్ స్మిత మరణం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!