Actress Jayaprada: టాలీవుడ్ సీనియర్ నటి బీజేపీ నాయకురాలు జయప్రద గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె ఇతర భాషలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. అయితే టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో నటి జయప్రద ఆయన మరణం పై స్పందిస్తూ కన్నీరు మున్నీరయ్యారు.

కృష్ణంరాజు పార్తివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఈమె మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.కృష్ణం రాజుగారు తన జీవితంలో సినీ నటుడిగా రాజకీయవేత్తగా కేంద్రమంత్రిగా ఎన్నో బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఎలాంటి మచ్చ లేకుండా రారాజుగా మరణించారు. ఇలా ఈయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.
కృష్ణంరాజు గారు ఎప్పుడు ఎక్కడ కనిపించినా జయప్రద ఎలా ఉన్నావమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన పిలిచే ఆ పిలుపు ఇప్పటికీ నా చెవులలో మారుమోగుతోంది. ఇలాంటి మంచి మనిషి మన మధ్యన లేరంటే నమ్మశక్యంగా లేదని ఈమె తెలియజేశారు.ఇక ఆయన నటించిన పలు సినిమాలలో నటించే అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు అదృష్టవంతురాలని అంటూ ఈమె కృష్ణంరాజు గురించి ఎమోషనల్ అయ్యారు.

Actress Jayaprada: మచ్చలేని మా రాజుగా బతికారు..
ఇక కృష్ణంరాజు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ ఆయన పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు చిన్న పిల్లలు వారికి, తన భార్య శ్యామలాదేవికి భగవంతుడు ఈ బాధ నుంచి బయటపడేందుకు ఎంతో శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా జయప్రద కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.





























